బ్లింకింగ్ లైట్స్తో తగ్గుముఖం పట్టిన ప్రమాదాలు
- June 01, 2019
బహ్రెయిన్:రెడ్ టైట్ ఉల్లంఘనలు కింగ్డమ్లో తగ్గుముఖం పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొత్త విధానం ద్వారా ఉల్లంఘనలతోపాటు ప్రమాదాలూ తగ్గినట్లు గణాంకాలు వెల్లడించాయి. గ్రీన్ లైట్ నుంచి ఎల్లో లైట్కి మారే క్రమంలో, మూడుసార్లు గ్రీన్ లైట్ బ్లింక్ అయ్యేలా కొత్త సాంకేతికతను ట్రాఫిక్ కూడళ్ళలో అమలు పర్చుతుండడంతోనే ఈ మార్పు సాధ్యమయ్యిందని ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారి వెల్లడించారు. జనరల్ డైరెక్టర్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ షేక్ అబ్దుల్రహ్మాన్ బిన్ అబ్దుల్ వహాబ్ అల్ ఖలీఫా మాట్లాడుతూ, ఇంటర్ సెక్షన్స్ వద్ద అమలు చేస్తున్న ఈ విధానంతో ప్రమాదాలు కొంతవరకు తగ్గాయని చెప్పారు. అల్ ఫతెహ్ ఇంటర్సెక్షన్లో తొలిసారిగా ఈ విధానాన్ని అమలు చేశారు. ఆ తర్వాత క్రమక్రమంగా పలు కూడళ్ళలో ఈ కొత్త విధానంతో కూడిన ట్రాఫిక్ సిగ్నల్స్ని ఏర్పాటు చేయడంతో ప్రమాదాలు, ఉల్లంఘనలు తగ్గుముఖం పట్టాయి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







