200 మంది కార్మికులకు ఇఫ్తార్ ఇచ్చిన చిన్నారులు
- June 01, 2019
అబుధాబి:కొంతమంది చిన్నారులు గ్రూప్గా ఏర్పడి, ముస్సాఫాలోని ఇండస్ట్రియల్ ఏరియాలో కార్మికులకు ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేశారు. 20 మంది చిన్నారుఉల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. అందులోనూ మెజార్టీ చిన్నారులు నాన్ ముస్లింలు కావడం మరో విశేషం. ఇండియన్ సోషల్ అండ్ కల్చర్ సెంటర్ (ఐఎస్సి)కి చెందిన చిన్నారుల విభాగం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ అనుశ్రీ, వైస్ ప్రెసిడెంట్ హరిశంకర్ మరియు చీఫ్ కో-ఆర్డినేటర్ పూజ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. సిటీ నుంచి 90 నిమిషాల బస్ జర్నీ తర్వాత లేబర్ అకామడేషన్కి చేరుకున్నామని, మాస్క్ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఇది తమకు చాలా గొప్ప అనుభవమనీ చిన్నారులు చెప్పారు. వారితో కలిసి ఫాస్టింగ్ని ముగించామని చిన్నారులు వివరించారు. పేరెంట్స్ డైరెక్షన్లో పిల్లలు చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల లేబరర్స్ కూడా హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







