200 మంది కార్మికులకు ఇఫ్తార్ ఇచ్చిన చిన్నారులు
- June 01, 2019
అబుధాబి:కొంతమంది చిన్నారులు గ్రూప్గా ఏర్పడి, ముస్సాఫాలోని ఇండస్ట్రియల్ ఏరియాలో కార్మికులకు ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేశారు. 20 మంది చిన్నారుఉల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. అందులోనూ మెజార్టీ చిన్నారులు నాన్ ముస్లింలు కావడం మరో విశేషం. ఇండియన్ సోషల్ అండ్ కల్చర్ సెంటర్ (ఐఎస్సి)కి చెందిన చిన్నారుల విభాగం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ అనుశ్రీ, వైస్ ప్రెసిడెంట్ హరిశంకర్ మరియు చీఫ్ కో-ఆర్డినేటర్ పూజ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. సిటీ నుంచి 90 నిమిషాల బస్ జర్నీ తర్వాత లేబర్ అకామడేషన్కి చేరుకున్నామని, మాస్క్ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఇది తమకు చాలా గొప్ప అనుభవమనీ చిన్నారులు చెప్పారు. వారితో కలిసి ఫాస్టింగ్ని ముగించామని చిన్నారులు వివరించారు. పేరెంట్స్ డైరెక్షన్లో పిల్లలు చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల లేబరర్స్ కూడా హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







