200 మంది కార్మికులకు ఇఫ్తార్ ఇచ్చిన చిన్నారులు
- June 01, 2019అబుధాబి:కొంతమంది చిన్నారులు గ్రూప్గా ఏర్పడి, ముస్సాఫాలోని ఇండస్ట్రియల్ ఏరియాలో కార్మికులకు ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేశారు. 20 మంది చిన్నారుఉల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. అందులోనూ మెజార్టీ చిన్నారులు నాన్ ముస్లింలు కావడం మరో విశేషం. ఇండియన్ సోషల్ అండ్ కల్చర్ సెంటర్ (ఐఎస్సి)కి చెందిన చిన్నారుల విభాగం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ అనుశ్రీ, వైస్ ప్రెసిడెంట్ హరిశంకర్ మరియు చీఫ్ కో-ఆర్డినేటర్ పూజ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. సిటీ నుంచి 90 నిమిషాల బస్ జర్నీ తర్వాత లేబర్ అకామడేషన్కి చేరుకున్నామని, మాస్క్ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఇది తమకు చాలా గొప్ప అనుభవమనీ చిన్నారులు చెప్పారు. వారితో కలిసి ఫాస్టింగ్ని ముగించామని చిన్నారులు వివరించారు. పేరెంట్స్ డైరెక్షన్లో పిల్లలు చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల లేబరర్స్ కూడా హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..