విజయవాడ లో అల్లరిమూక బీభత్సం..

- June 02, 2019 , by Maagulf
విజయవాడ లో అల్లరిమూక బీభత్సం..

విజయవాడ లో అర్ధరాత్రి అల్లరిమూక బీభత్సం సృష్టించింది. తమ బైక్‌కు సైడ్‌ ఇవ్వలేదనే కారణంతో తెలంగాణ నార్కట్‌పల్లి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సును వెంబడించి.. గొల్లపూడి వద్దకు రాగానే బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. బస్‌లోకి చొరబడి.. డ్రైవర్‌పై తీవ్రంగా దాడి చేసి.. 25 వేల రూపాయలు లాక్కెళ్లారు. యువకుల బీభత్సంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.. మరికొదరి కోసం గాలిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com