రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
- June 06, 2019
అబుధాబిలోని అల్ ఫలాహ్ డిస్ట్రిక్ట్లో ఓ వాహనం అతి వేగంగా దూసుకొచ్చి ల్యాంప్ పోస్ట్ని ఢీ కొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు వున్నారు. చిన్నారుల తల్లి వాహనాన్ని నడుపుతుండగా, వాహనం అదుపు తప్పింది. ఆమె పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా వుంది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతోపాటు, వారి నానీ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో 15 ఏళ్ళ బాలుడు, అతని చెల్లెళ్ళు (12, 11 ఏళ్ళ వయసు) వున్నారు. అతి వేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోందని వివరించారు అబుదాబీ పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ - డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్సటర్నల్ జోన్స్ డిప్యూటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్లా అల్ సువైది. వాహనం నడుపుతున్న మహిళకు డ్రైవింగ్ లైసెన్స్ లేదని ఆయన వివరించారు. వాహనదారులు పరిమిత వేగంతో వాహనాల్ని నడపాలనీ, ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలని అల్ సువైది విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









