రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
- June 06, 2019
అబుధాబిలోని అల్ ఫలాహ్ డిస్ట్రిక్ట్లో ఓ వాహనం అతి వేగంగా దూసుకొచ్చి ల్యాంప్ పోస్ట్ని ఢీ కొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు వున్నారు. చిన్నారుల తల్లి వాహనాన్ని నడుపుతుండగా, వాహనం అదుపు తప్పింది. ఆమె పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా వుంది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతోపాటు, వారి నానీ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో 15 ఏళ్ళ బాలుడు, అతని చెల్లెళ్ళు (12, 11 ఏళ్ళ వయసు) వున్నారు. అతి వేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోందని వివరించారు అబుదాబీ పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ - డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్సటర్నల్ జోన్స్ డిప్యూటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్లా అల్ సువైది. వాహనం నడుపుతున్న మహిళకు డ్రైవింగ్ లైసెన్స్ లేదని ఆయన వివరించారు. వాహనదారులు పరిమిత వేగంతో వాహనాల్ని నడపాలనీ, ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలని అల్ సువైది విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







