రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
- June 06, 2019అబుధాబిలోని అల్ ఫలాహ్ డిస్ట్రిక్ట్లో ఓ వాహనం అతి వేగంగా దూసుకొచ్చి ల్యాంప్ పోస్ట్ని ఢీ కొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు వున్నారు. చిన్నారుల తల్లి వాహనాన్ని నడుపుతుండగా, వాహనం అదుపు తప్పింది. ఆమె పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా వుంది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతోపాటు, వారి నానీ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో 15 ఏళ్ళ బాలుడు, అతని చెల్లెళ్ళు (12, 11 ఏళ్ళ వయసు) వున్నారు. అతి వేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోందని వివరించారు అబుదాబీ పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ - డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్సటర్నల్ జోన్స్ డిప్యూటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్లా అల్ సువైది. వాహనం నడుపుతున్న మహిళకు డ్రైవింగ్ లైసెన్స్ లేదని ఆయన వివరించారు. వాహనదారులు పరిమిత వేగంతో వాహనాల్ని నడపాలనీ, ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలని అల్ సువైది విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?