హువాయ్ ఐసిటి గ్లోబల్ ఫైనల్లో సత్తా చాటిన బహ్రెయిన్ విద్యార్థులు
- June 07, 2019
బహ్రెయినీ విద్యార్థులు హువాయ్ ఐసిటి కాంపిటీషన్ ఫైనల్లో సత్తా చాటారు. చైనాలోని షెన్జెన్లో జరిగిన ఈ పోటీల్లో బహ్రెయిన్ టీమ్ మూడో ర్యాంక్ని సొంతం చేసుకుంది. ఎఎంఎ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ బహ్రెయిన్కి చెందిన మఖాట్రోనిక్స్ ఇంజనీరింగ్ - బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ విద్యార్థి వలీద్ యూసుఫ్, మరో ఇద్దరు విద్యార్థులతో కలిసి ఈ ఘనతను దక్కించుకున్నారు. చైనాలోని షెన్జాన్లో మే 25, 26 తేదీల్లో ఈ పోటీలు జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు టీమ్స్ ఈ పోటీల్లో పాల్గొన్నాయి. హువాయ్ ఐసిటి కాంపిటీషన్ మిడిల్ ఈస్ట్ ఇన్ చైనాకి సంబంధించి గత ఏడాది వాలీద్ అతని టీమ్ రెండో స్థానం దక్కించుకుంది. హువాయి ఐసిటి కాంపిటీషన్కి 61 దేశాల నుంచి, 1,600 కాలేజీలకు చెందిన 100,000 స్టూడెంట్స్ హాజరయ్యారు ఈ ఏడాది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







