దుబాయ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల వివరాలు..

- June 07, 2019 , by Maagulf
దుబాయ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల వివరాలు..

అల్‌ రష్దియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోగా, అందులో 12 మంది భారతీయులున్నారు. గాయపడ్డవారిలో నలుగురు భారతీయులు వైద్య చికిత్స అనంతరం రషీద్‌ హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. మృతుల్ని గుర్తించేందుకు బంధువులు పెద్దయెత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. భారత కాన్సుల్‌ జనరల్‌ విపుల్‌, మొత్తం 12 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు ధృవీకరించారు. వారి వివరాలు ఈ విధంగా వున్నాయి. 

1. విక్రమ్‌ జవహార్‌ ఠాకూర్‌ 
2. విమల్‌ కుమార్‌ కార్తికేయన్‌ కేశవపిలైకర్‌ 
3. కిరణ్‌ జానీ జానీ వల్లిత్తోట్టతిల్‌ పైలి 
4. ఫిరోజ్‌ ఖాన్‌ అజీజ్‌ పఠాన్‌ 
5. రస్త్రష్మా ఫిరోజ్‌ ఖాన్‌ అజీజ్‌ పఠాన్‌ 
6. ఉమ్మర్‌ చొనోకతవాత్‌ మమ్మద్‌ పుతెన్‌ 
7. నబి ఉమ్మెర్‌ చోనోకటవత్‌ 
8. వాసుదేవ్‌ విషన్‌దాస్‌ 
9. రాజన్‌ పుతియాపురాయిల్‌ గోపాలన్‌ 
10. జమాలుద్దీన్‌ ముహమ్మెదున్ని జమాలుద్దీన్‌ 
11. ప్రబుల మాధవన్‌ దీపా కుమార్‌ 
12. రోషిని మూల్చందాని. 

ఆసుపత్రిలో మరికొంతమంది తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న దరిమిలా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. మృతదేహాల్ని స్వస్థలాలకు చేర్చేందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com