అదృశ్యమైన విమాన శకలాలు లభ్యం
- June 11, 2019
ఎనిమిది రోజుల క్రితం అదృశ్యమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన AN-32 విమానం శకలాలను గుర్తించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సయాంగ్ జిల్లాలో విమానం శకలాలు లభ్యం అయ్యాయి. కొద్ది రోజులుగా ఐఏఎఫ్ తోపాటు ఆర్మీ కూడా అదృశ్యమైన విమానం కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.గాలింపు చర్యల్లో పాల్గొన్న MI-17 హెలికాప్టర్ సియాంగ్ జిల్లాలో విమాన శకలాలను గుర్తించింది.
13మంది సిబ్బందితో జూన్-3,2019న మధ్యాహ్నం 12.25 గంటలకు అసోంలోని జోర్హత్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన AN-32 అరుణాచల్ ప్రదేశ్ లోని మెచుకా వ్యాలీలో ల్యాండింగ్ కావాల్సివుంది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మధ్యాహ్నం 1 గంటకు రాడార్ తో సంబంధాలు తెగిపోయి విమానం కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.
విమాన ఆచూకీ కోసం ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. సుకోయ్ -30, సీ-130 జెట్ విమానాలతో ఆపరేషన్ కొనసాగింది. గాలింపు చర్యల్లో భాగంగా ఐఏఎఫ్ ఎంఐ-17 హెలికాప్టర్ తో ఏఎన్ -35 విమానం కోసం వెతుకుతుండగా సియాంగ్ జిల్లాలో విమాన శకాలను గుర్తించారు.
తాజా వార్తలు
- తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన ముంబై నేవీ
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్లో అమెరికా దాడులు.. ఏడుగురు సైనికులు మృతి
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!







