అదృశ్యమైన విమాన శకలాలు లభ్యం
- June 11, 2019
ఎనిమిది రోజుల క్రితం అదృశ్యమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన AN-32 విమానం శకలాలను గుర్తించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సయాంగ్ జిల్లాలో విమానం శకలాలు లభ్యం అయ్యాయి. కొద్ది రోజులుగా ఐఏఎఫ్ తోపాటు ఆర్మీ కూడా అదృశ్యమైన విమానం కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.గాలింపు చర్యల్లో పాల్గొన్న MI-17 హెలికాప్టర్ సియాంగ్ జిల్లాలో విమాన శకలాలను గుర్తించింది.
13మంది సిబ్బందితో జూన్-3,2019న మధ్యాహ్నం 12.25 గంటలకు అసోంలోని జోర్హత్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన AN-32 అరుణాచల్ ప్రదేశ్ లోని మెచుకా వ్యాలీలో ల్యాండింగ్ కావాల్సివుంది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మధ్యాహ్నం 1 గంటకు రాడార్ తో సంబంధాలు తెగిపోయి విమానం కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.
విమాన ఆచూకీ కోసం ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. సుకోయ్ -30, సీ-130 జెట్ విమానాలతో ఆపరేషన్ కొనసాగింది. గాలింపు చర్యల్లో భాగంగా ఐఏఎఫ్ ఎంఐ-17 హెలికాప్టర్ తో ఏఎన్ -35 విమానం కోసం వెతుకుతుండగా సియాంగ్ జిల్లాలో విమాన శకాలను గుర్తించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







