అదృశ్యమైన విమాన శకలాలు లభ్యం
- June 11, 2019
ఎనిమిది రోజుల క్రితం అదృశ్యమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన AN-32 విమానం శకలాలను గుర్తించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సయాంగ్ జిల్లాలో విమానం శకలాలు లభ్యం అయ్యాయి. కొద్ది రోజులుగా ఐఏఎఫ్ తోపాటు ఆర్మీ కూడా అదృశ్యమైన విమానం కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.గాలింపు చర్యల్లో పాల్గొన్న MI-17 హెలికాప్టర్ సియాంగ్ జిల్లాలో విమాన శకలాలను గుర్తించింది.
13మంది సిబ్బందితో జూన్-3,2019న మధ్యాహ్నం 12.25 గంటలకు అసోంలోని జోర్హత్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన AN-32 అరుణాచల్ ప్రదేశ్ లోని మెచుకా వ్యాలీలో ల్యాండింగ్ కావాల్సివుంది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మధ్యాహ్నం 1 గంటకు రాడార్ తో సంబంధాలు తెగిపోయి విమానం కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.
విమాన ఆచూకీ కోసం ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. సుకోయ్ -30, సీ-130 జెట్ విమానాలతో ఆపరేషన్ కొనసాగింది. గాలింపు చర్యల్లో భాగంగా ఐఏఎఫ్ ఎంఐ-17 హెలికాప్టర్ తో ఏఎన్ -35 విమానం కోసం వెతుకుతుండగా సియాంగ్ జిల్లాలో విమాన శకాలను గుర్తించారు.
తాజా వార్తలు
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ









