భారత్పై విషప్రచారానికి పాక్ అస్త్రం..15 ఎఫ్ఎంలు!
- June 15, 2019
కాశ్మీర్లో భారత్పై విషప్రచారం చేసేందుకు పాక్ భారత సరిహద్దుల్లో ఎఫ్ఎం ఛానళ్లను ఏర్పాటు చేసింది. ఈ విషయంపై అప్రమత్తమైన భారత ప్రభుత్వం సరిహద్దుల్లో ఎన్ని ఛానళ్లు చురుగ్గా పనిచేస్తున్నాయో లెక్కలు ఇవ్వమని పేర్కొంది.
పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని కోట్లీ, ముజఫరాబాద్, మిర్పూర్లలో కొత్తగా ఎఫ్ఎం స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఇవి ఆర్ఎస్పురా, రాజౌరి, పూంచ్, నౌషెరా ప్రాంతాల్లో కూడా ప్రసారం అవుతున్నాయి. వీటి ద్వారా భారత్కు వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని విరివిరిగా ప్రచారం చేస్తుంది. ప్రజాదరణ పొందిన పాటలను ప్రసారం చేస్తూ మధ్యలో పాక్ సైన్యానికి అనుకూలంగా ఉండే అంశాలను ప్రస్తావిస్తున్నారని కేంద్ర నిఘా వర్గాలు, సైన్యం చెబుతున్నాయి. వీటిల్లోని కొన్ని రేడియోస్టేషన్లను ఉగ్రసంస్థలు నిర్వహిస్తుండటం గమనార్హం. మొత్తం 15 రేడియో స్టేషన్లు చురుగ్గా పనిచేస్తున్నాయని భారత వర్గాలు గుర్తించాయి.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









