రాష్ట్రీయ ఇసాయి మంచ్
- January 04, 2016
క్రైస్తవులకు చేరువ కావాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఒక సంస్థను ప్రారంభించనున్నది. రాష్ట్రీయ ఇసాయి మంచ్ పేరిట ప్రారంభం కానున్న ఈ సంస్థ ద్వారా క్రైస్తవులకు చేరువ కావాలని ఆరెస్సెస్ ప్రయత్నిస్తోంది. ఆరెస్సెస్ ముస్లింలను మచ్చిక చేసుకోవడానికి ఇప్పటికే ముస్లిం రాష్ట్రీయ మంచ్ను ప్రారంభించింది. అవే మార్గదర్శకాలతో క్రైస్తవ రాష్ట్రీయ మంచ్ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నది. ముస్లిం రాష్ట్రీయ మంచ్కు రూపకల్పన చేసిన ఆరెస్సెస్ సీనియర్ ప్రచారక్ ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించారు. నలుగురైదుగురు ఆర్చ్బిషప్లు, సుమారు 40 నుంచి 50 మంది రివరెండ్ బిషప్లతో సమావేశాలు నిర్వహించామని, తద్వారా సంస్థ ఏర్పాటుకు అవసరమైన సన్నాహాలు ప్రారంభించామని ఆరెస్సెస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రేష్ కుమార్ చెప్పారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







