బస్సులో ఊపిరాడక చనిపోయిన చిన్నారి
- June 17, 2019దుబాయ్లో ఓ చిన్నారి బస్సులో ప్రాణాలు కోల్పోయాడు. సెంటర్ ఫర్ మొమొరైజింగ్ కురాన్కి చెందిన బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. అల్ కోజ్ ఏరియాలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే, బాలుడు బస్సులో వుండిపోయిన విషయాన్ని బస్ డ్రైవర్, సూపర్వైజర్ గుర్తించకుండానే డోర్స్ క్లోజ్ చేయడంతో 9 గంటలపాటు బస్సులో చిన్నారి వుండిపోయాడు. ఈ క్రమంలో బాలుడు ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు డ్రైవర్నీ, సూపర్వైజర్నీ ప్రశ్నిస్తున్నారు. బాలుడ్ని భారతదేశంలోని కేరళకు చెందిన మొహమ్మద్ ఫర్హాన్గా గుర్తించారు. తన సోదరి పెళ్ళి కోసం చిన్నారి తన కుటుంబంతో కలిసి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. బాలుడి తండ్రి ఫైజల్ కెపి అనీ కేరళకు చెందినవారనీ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్