రాజధాని నగరాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చి దిద్దుతామని కే.టి.ఆర్..
- January 04, 2016
రాజధాని హైదరాబాద్ నగరాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చి దిద్దుతామని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఇవాళ ఆయన సనత్నగర్ మోడల్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. క్రీడలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని వెల్లడించారు. క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందజేస్తున్నారని తెలిపారు. రూ.5 కోట్లతో సనత్నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను అభివృద్ది చేస్తామన్నారు. నగరంలోని ప్లే గ్రౌండ్లను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. వాటిని కబ్జాలకు గురికాకుండా కాపాడి మన భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు.గత పాలకులు క్రీడాకారులను పట్టించుకోలేదని పేర్కొన్నారు
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







