రాజధాని నగరాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చి దిద్దుతామని కే.టి.ఆర్..
- January 04, 2016
రాజధాని హైదరాబాద్ నగరాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చి దిద్దుతామని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఇవాళ ఆయన సనత్నగర్ మోడల్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. క్రీడలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని వెల్లడించారు. క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందజేస్తున్నారని తెలిపారు. రూ.5 కోట్లతో సనత్నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను అభివృద్ది చేస్తామన్నారు. నగరంలోని ప్లే గ్రౌండ్లను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. వాటిని కబ్జాలకు గురికాకుండా కాపాడి మన భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు.గత పాలకులు క్రీడాకారులను పట్టించుకోలేదని పేర్కొన్నారు
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







