ఇరాన్ ఏం చేస్తోందో చూస్తున్నాం..కాచుకొని ఉన్నాం: ట్రంప్
- June 19, 2019
వాషింగ్టన్: ఇరాన్ చర్యలను తాము ముందే ఊహించి అందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఇరాన్ సమీపంలో గల్ఫ్ ఆఫ్ ఒమన్లో చమురు ట్యాంకర్లపై దాడి జరగిన నాటి నుంచి అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం ట్రంప్ స్పందించారు. ''మేము ఇరాన్ కోసం కాచుకొని ఉన్నాము. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. వారేం చేస్తున్నారో చూస్తున్నాం. కేవలం గత వారం చేసిన విషయాలు కాదు.. చాలా కాలం నుంచి ఇరాన్ను గమనిస్తున్నాం. అది ఉగ్రవాద దేశంగా కొనసాగుతోంది.'' అని ఆయన వ్యాఖ్యానించారు. టైమ్ పత్రికతో మాట్లాడుతూ ట్రంప్ ఈ మాటలు అన్నారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా సైనిక చర్య చేపట్టడానికి కూడా సిద్ధమేనని అన్నారు.
మధ్యప్రాఛ్యంలో మరో 1000 మంది సైనికులను తరలిస్తున్నట్లు అమెరికా ప్రకటించిన మర్నాడే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో చమురు ట్యాంకర్లపై ఇరానే దాడి చేసిందని అమెరికా ఆరోపించిన విషయం తెలిసిందే. గత వారం నుంచి పరిస్థితులు వేగంగా మారిపోయాయి. సోమవారం ఇరాన్ మరో కీలక ప్రకటన చేసింది. 2015 ఒప్పందం ప్రకారం పేర్కొన్న యూరేనియం నిల్వల పరిధిని త్వరలో దాటేస్తామని తెలిపింది. గత ఏడాది అమెరికా ఈ ఒప్పందం నుంచి వైదొలగిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్ల ట్రయల్స్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- ఏపీ ప్రజలకు విశాఖ AIG గుడ్ న్యూస్
- విద్యార్థులపై అరాచకాలకు పాల్పడిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: CJI
- శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
- ప్రధాని మోదీ వీడియో నిలిపివేత: కేంద్ర ప్రభుత్వానికి మెటా క్షమాపణలు!
- డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడితే భారీ జరిమానా..
- ప్రధాని మోదీతో స్కైరూట్ ఫౌండర్లు భేటీ: ‘విక్రమ్-1’ విజయవంతంపై ప్రశంసల వర్షం!
- ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్
- ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!







