423 కిలోల డ్రగ్స్‌ సీజ్‌: 12 మంది వలసదారుల అరెస్ట్‌

- June 19, 2019 , by Maagulf
423 కిలోల డ్రగ్స్‌ సీజ్‌: 12 మంది వలసదారుల అరెస్ట్‌

అబుధాబి పోలీసులు 423 కిలోల హెరియాన్‌ అలాగే క్రిస్టల్‌ మెత్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో అతి పెద్ద డ్రగ్స్‌ హాల్‌గా దీన్ని అభివర్ణిస్తున్నారు పోలీసులు. ఈ కేసులో 12 మంది ఆసియా జాతీయుల్ని కూడా అరెస్ట్‌ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఓ వెహికల్‌లో రహస్య ప్రాంతంలో వుంచి డ్రగ్స్‌ని నిందితులు తరలిస్తున్నట్లు పోలీసులు వివరించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం 500,000 కాప్టగాన్‌ ట్యాబ్లెట్స్‌ కూడా ఈ సందర్భంగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కొద్ది నెలలుగా డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామనీ, ఈ డ్రగ్స్‌ సీజ్‌తో తమ ప్రయత్నం విజయవంతమయ్యిందని డ్రగ్‌ కంట్రోల్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ కల్నల్‌ తహెర్‌ ఘారిబ్‌ అల్‌ దాహిరి చెప్పారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com