423 కిలోల డ్రగ్స్ సీజ్: 12 మంది వలసదారుల అరెస్ట్
- June 19, 2019
అబుధాబి పోలీసులు 423 కిలోల హెరియాన్ అలాగే క్రిస్టల్ మెత్ని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో అతి పెద్ద డ్రగ్స్ హాల్గా దీన్ని అభివర్ణిస్తున్నారు పోలీసులు. ఈ కేసులో 12 మంది ఆసియా జాతీయుల్ని కూడా అరెస్ట్ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఓ వెహికల్లో రహస్య ప్రాంతంలో వుంచి డ్రగ్స్ని నిందితులు తరలిస్తున్నట్లు పోలీసులు వివరించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం 500,000 కాప్టగాన్ ట్యాబ్లెట్స్ కూడా ఈ సందర్భంగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కొద్ది నెలలుగా డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామనీ, ఈ డ్రగ్స్ సీజ్తో తమ ప్రయత్నం విజయవంతమయ్యిందని డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ తహెర్ ఘారిబ్ అల్ దాహిరి చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







