423 కిలోల డ్రగ్స్ సీజ్: 12 మంది వలసదారుల అరెస్ట్
- June 19, 2019
అబుధాబి పోలీసులు 423 కిలోల హెరియాన్ అలాగే క్రిస్టల్ మెత్ని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో అతి పెద్ద డ్రగ్స్ హాల్గా దీన్ని అభివర్ణిస్తున్నారు పోలీసులు. ఈ కేసులో 12 మంది ఆసియా జాతీయుల్ని కూడా అరెస్ట్ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఓ వెహికల్లో రహస్య ప్రాంతంలో వుంచి డ్రగ్స్ని నిందితులు తరలిస్తున్నట్లు పోలీసులు వివరించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం 500,000 కాప్టగాన్ ట్యాబ్లెట్స్ కూడా ఈ సందర్భంగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కొద్ది నెలలుగా డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామనీ, ఈ డ్రగ్స్ సీజ్తో తమ ప్రయత్నం విజయవంతమయ్యిందని డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ తహెర్ ఘారిబ్ అల్ దాహిరి చెప్పారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







