నిప్పుల కొలిమిని తలపిస్తున్న కువైట్, పాకిస్తాన్
- June 20, 2019
న్యూయార్క్: గత కొన్నేళ్లుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో భూమండలం మొత్తం అగ్నిగోళంగా మారిపోతుండగా అత్యధిక ఉష్ణోగ్రతలతో మూడు, నాలుగు స్థానాలలో నిలిచిన కువైట్, పాకిస్తాన్లు నిప్పుల కుంపట్లను తలపిస్తున్నాయని వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. కువైట్లోని మిట్రిబాలో 2016 జులై 21న 59 డిగ్రీలసెల్షియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, పాకిస్తాన్లోని తర్బత్లో 2017 మే 28న 53.7 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఈ సంస్థ వివరించింది. ఈరెండు ప్రదేశాలనూ ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయిన మూడు, నాలుగు ప్రదేశాలుగా గుర్తించినట్లు తెలిపింది. 76 ఏళ్లకాలంలో అధికారికంగా నమోదయిన అత్యధిక ఉష్ణోగ్రతలివే కావటం విశేషం.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు







