'యోగా డే'లో పాల్గొన్న వేలాదిమంది ఔత్సాహికులు

- June 21, 2019 , by Maagulf
'యోగా డే'లో పాల్గొన్న వేలాదిమంది ఔత్సాహికులు

అబుధాబి: ఇండియన్‌ ఎంబసీ నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో వేలాదిమంది రెసిడెంట్స్‌ పాల్గొన్నారు. ఉమ్‌ అల్‌ ఎమరాత్‌ పార్క్‌లో ఈ కార్యక్రమం జరిగింది. 10 నుంచి 15 నిమిషాల పాటు సాగిన ఒక్కో సెషన్‌లో ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మినిస్టర్‌ ఆఫ్‌ టోలరెన్స్‌ షేక్‌ నహ్యాన్‌ బిన్‌ ముబారక్‌ అల్‌ నహ్యాన్‌ ఈ కార్యక్రమానికి చీఫ్‌ గెస్ట్‌గా హాజరయ్యారు. ఇంటర్నేషనల్‌ యోగా దినోత్సవానికి యూఏఈ స్ట్రాంగ్‌ సపోర్టర్‌ అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. 'వసుదైక కుటంబం' అనే భారత దేశ నినాదం చాలా గొప్పదని చెప్పారాయన. యోగా అనేది జీవన విధానమని వివరించారు మినిస్టర్‌. థెరప్యుటిక్‌ యోగా ఫర్‌ కోర్‌ స్ట్రెంగ్త్‌, ఫేస్‌ యోగా, రాజ యోగ, లాఫర్‌ యోగా, యోగా ఫర్‌ స్పైనల్‌ హెల్త్‌, హార్ట్‌ఫుల్‌నెస్‌ యోగా.. ఇలా రకరకాల యోగా ప్రక్రియల్ని ఆయా ప్రక్రియల్లో నిష్ణాతులు ప్రదర్శించి, వాటి ఫలితాల్ని తెలియజేశారు.   

--సుమన్ (మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి),ప్రదీప్ (మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com