'యోగా డే'లో పాల్గొన్న వేలాదిమంది ఔత్సాహికులు
- June 21, 2019
అబుధాబి: ఇండియన్ ఎంబసీ నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో వేలాదిమంది రెసిడెంట్స్ పాల్గొన్నారు. ఉమ్ అల్ ఎమరాత్ పార్క్లో ఈ కార్యక్రమం జరిగింది. 10 నుంచి 15 నిమిషాల పాటు సాగిన ఒక్కో సెషన్లో ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మినిస్టర్ ఆఫ్ టోలరెన్స్ షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఇంటర్నేషనల్ యోగా దినోత్సవానికి యూఏఈ స్ట్రాంగ్ సపోర్టర్ అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. 'వసుదైక కుటంబం' అనే భారత దేశ నినాదం చాలా గొప్పదని చెప్పారాయన. యోగా అనేది జీవన విధానమని వివరించారు మినిస్టర్. థెరప్యుటిక్ యోగా ఫర్ కోర్ స్ట్రెంగ్త్, ఫేస్ యోగా, రాజ యోగ, లాఫర్ యోగా, యోగా ఫర్ స్పైనల్ హెల్త్, హార్ట్ఫుల్నెస్ యోగా.. ఇలా రకరకాల యోగా ప్రక్రియల్ని ఆయా ప్రక్రియల్లో నిష్ణాతులు ప్రదర్శించి, వాటి ఫలితాల్ని తెలియజేశారు.
--సుమన్ (మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి),ప్రదీప్ (మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)






_1561094832.jpg)

తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







