మెదడు వాపు వ్యాధితో చనిపోతున్న చిన్నారులు
- June 25, 2019
బీహార్లోని ముజఫర్ఫర్పూర్ జిల్లాలో మెదడు వాపు వ్యాధితో వందలాదిమంది చిన్నారులు చనిపోతున్నారు. ఇప్పటికే 117కి పైగా చిన్నారులు చనిపోయారు. చిన్నారుల ప్రాణాల్ని ప్రభుత్వం కాపాడలేకపోతోంది, అసలు ప్రభుత్వం దీన్ని పట్టించుకోవడంలేదంటూ బీహార్కు చెందిన అజ్మానీ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీంతో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సీఎం నితీష్ కుమార్కు అక్షింతలు వేసింది. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్లతో కూడిన ధర్మాసనం…. బీహార్తో పాటు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది..
పిల్లల మరణాలకు సంబంధించిన పూర్తి వివరాలను సుప్రీం కోర్టుకు అందించాలని బీహార్ను అదేశించింది. వ్యాధిని ఎదుర్కొనేందుకు నితీష్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటో అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశించింది. అటు సీఎం నితీష్ కుమార్ మాత్రం.. చిన్నారుల మరణాలపై సరిగా స్పందించడం లేదు. మీడియా ప్రశ్నించినా సీరియస్ అవుతున్నారు. మృతుల కుటుంబాలకు కేవలం 4 లక్షల రుపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితి కొనసాగడానికి వీల్లేదని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తూతూ మంత్రపు చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం కావాలని సూచించింది. విచారణను 10 రోజులపాటు వాయిదా వేసింది.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







