డ్రోన్ కెమెరాల నిషేదం
- January 04, 2016
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో డ్రోన్ కెమెరాల నిషేదం పోలీసు కమిషనర్ సీరియస్గా ఉన్నారు. తాజాగా ఈ కెమెరాల నిషేధానికి సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేశారు. పోలీసు కమిషనరేట్ పరిధిలో కొంత మంది ఎలాంటి అనుమతులు లేకుండా చాలా ఈ వెంట్స్, వివాహాలు, పలు ఫంక్షన్స్ల్లో వీటిని ఎగురవేస్తూ ఫొటోలు తీస్తున్నట్లు సమాచారం అందింది. తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో అనుమతి లేని ఈ డ్రోన్ కెమెరాలను ఎగురవేయడం విమాన రాకపోకలతో పాటు ఇతర అంశాల్లో కూడా ఇవి పెద్ద ప్రమాదాన్ని సృష్టించే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర విమానయాన శాఖ 2014 అక్టోబరు నుంచి వీటి ఎగరాడాన్ని నిషేదించింది.అదే విధంగా వీటికి సంబంధించిన అనుమతులను జారీ చేసేందుకు డీజీసీఏ పలు అంశాలపై ఆధ్యయనం చేస్తుంది. డీజీసీఏ నుంచి తాజా ఉత్తర్వులు వచ్చే వరకు ప్రైవేటు వ్యక్తులు వీటిని ఎగురవేయడం పూర్తి నిబంధనలకు విరుద్ధమని సీపీ నోటిఫికేషన్లో వివరించారు. విమానాయన శాఖ,పోలీసుల నుంచి అనుమతులు ఉంటేనే డ్రోన్ కెమెరాలు ఎగురవేయాలని సీపీ స్పష్టం చేశారు. ఈ డ్రోన్ కెమెరాల వ్యవహారంలో అనుమతులు లేకుండా ఎవరైనా ఎగురవేస్తా స్థానిక పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ బాధ్యులుగా పరిగణీస్తామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









