తెలంగాణపైనే ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ హైకమాండ్
- July 01, 2019
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా.. తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ మూడు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ పరిస్థితి, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగింది. వీటిపై అమిత్షాకు నివేదిక అందించారు కొందరు బీజేపీ నేతలు. ఈ రిపోర్టులను పరిశీలించిన అమిత్షా….. పార్టీ సభ్యత్వ నమోదును ఎలా చేయాలో వారికి వివరించినట్లు తెలుస్తోంది. సంస్థాగతంగా పార్టీ పటిష్ఠతపైనే ముఖ్యంగా చర్చించనట్లు తెలుస్తోంది.
ప్రధానంగా తెలంగాణపైనే ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ హైకమాండ్. అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో కలిసి తెలంగాణ బీజేపీ ముఖ్య నేతల కోర్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఇందులో మున్సిపల్ ఎన్నికలు, ఉప ఎన్నిలపై చర్చించారు. అలాగే బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఇందులో చర్చించారు. సమావేశంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మురళీధర్ రావు, రాజా సింగ్, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 6 నుంచి దేశవ్యాప్తంగా పార్టీ సభ్యత్వకార్యక్రమాన్ని శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్షా,….శంషాబాద్లో సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పార్టీలో చేరిన ప్రముఖనేతలతో పాటు పార్టీ నేతల గురించి అడిగి తెలుసుకున్నారు అమిత్షా. అనంతరం బెంగాల్ నేతలతోనూ, చివరికి ఒడిశా నేతలతో సమావేశమయ్యారు అమిత్షా.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







