తెలంగాణపైనే ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ హైకమాండ్
- July 01, 2019
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా.. తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ మూడు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ పరిస్థితి, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగింది. వీటిపై అమిత్షాకు నివేదిక అందించారు కొందరు బీజేపీ నేతలు. ఈ రిపోర్టులను పరిశీలించిన అమిత్షా….. పార్టీ సభ్యత్వ నమోదును ఎలా చేయాలో వారికి వివరించినట్లు తెలుస్తోంది. సంస్థాగతంగా పార్టీ పటిష్ఠతపైనే ముఖ్యంగా చర్చించనట్లు తెలుస్తోంది.
ప్రధానంగా తెలంగాణపైనే ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ హైకమాండ్. అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో కలిసి తెలంగాణ బీజేపీ ముఖ్య నేతల కోర్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఇందులో మున్సిపల్ ఎన్నికలు, ఉప ఎన్నిలపై చర్చించారు. అలాగే బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఇందులో చర్చించారు. సమావేశంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మురళీధర్ రావు, రాజా సింగ్, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 6 నుంచి దేశవ్యాప్తంగా పార్టీ సభ్యత్వకార్యక్రమాన్ని శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్షా,….శంషాబాద్లో సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పార్టీలో చేరిన ప్రముఖనేతలతో పాటు పార్టీ నేతల గురించి అడిగి తెలుసుకున్నారు అమిత్షా. అనంతరం బెంగాల్ నేతలతోనూ, చివరికి ఒడిశా నేతలతో సమావేశమయ్యారు అమిత్షా.
తాజా వార్తలు
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు







