'స్పైస్ జెట్' ఎయిర్లైన్స్ వారి కొత్త ఆఫర్

- July 03, 2019 , by Maagulf
'స్పైస్ జెట్' ఎయిర్లైన్స్ వారి కొత్త ఆఫర్

న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్..వర్షాకాల ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నెల 6 వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్ కింద దేశీయంగా ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను రూ.888గా నిర్ణయించింది. పరిమిత కాల ఆఫర్‌లో బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు ఈ ఏడాది సెప్టెంబర్ 25 లోగా ప్రయాణించాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. పరిమిత సీట్లు కలిగిన ఈ ఆఫర్ కింద ముందుగా బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే లభించనున్నట్లు ఒక ప్రకటనలో సంస్థ తెలిపింది. అంతర్జాతీయ రూట్లలో కూడా వర్తించనున్న ఈ ఆఫర్ కింద ప్రారంభ విమాన టిక్కెట్టును రూ.3,499కి విక్రయిస్తున్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com