అమెరికాలో అడ్డంగా బుక్ అయిన తెలుగోళ్లు...
- July 04, 2019
అమెరికా:అవకాశాల స్వర్గదామంగా పేరొందిన అమెరికాలో నిబంధనలు ఉల్లంఘించిన ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. హెచ్1బీ వీసా ప్రోగ్రామ్ను దుర్వినియోగపరిచారనే ఆరోపణలపై నలుగురు భారతీయ అమెరికన్లను అరెస్ట్ చేసింది. ఈ మేరకు అమెరికా న్యాయ విభాగం వెల్లడించింది. విజయ్ మానె, వెంకటరమణ మన్నం, ఫెర్నాండో సిల్వా, సతీశ్ వేమూరిపై వీసా నేరాలకు సంబంధించిన అభియోగాలు మోపినట్లు తెలిపింది. నిందితులందరినీ 2,50,000 డాలర్ల పూచీకత్తుపై విడుదల చేసినట్లు తెలిపింది. వారిపై నమోదైన అభియోగాల ప్రకారం గరిష్ఠంగా ఐదేండ్ల జైలు, 2,50,000 డాలర్ల చొప్పున జరిమానా పడే అవకాశం ఉంది.
హెచ్1బీ అనేది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. దీని ద్వారా అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు వీలవుతుంది. అమెరికా న్యాయ విభాగం వివరాల ప్రకారం.. విజయ్, వెంకటరమణ, వేమూరి.. న్యూజెర్సీలోని మిడిల్సెక్స్ కౌంటీలో ప్రొక్యూర్ ప్రొఫెషనల్ ఇంక్, క్రిప్టో ఐటీ సొల్యూషన్స్ ఇంక్ పేరిట రెండు ఐటీ స్టాఫింగ్ (ఐటీ నిపుణులను అందించే) కంపెనీలను నడుపుతున్నారు. అలాగే సిల్వా, వెంకటరమణ..
క్లయింట్ ఏ పేరిట మరో కంపెనీని నిర్వహిస్తున్నారు. ప్రొక్యూర్, క్రిప్టో కంపెనీల ద్వారా విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసాలను అందిస్తున్నారు. అయితే వీసా దరఖాస్తులను వేగవంతం చేసేందుకు, సదరు విదేశీ ఉద్యోగి ఇదివరకే క్లయింట్ ఏలో పనిచేస్తున్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. పోటీసంస్థలపై పై చేయి సాధించేందుకు వీరు వీసా ప్రోగ్రామ్ను దుర్వినియోగం చేశారని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







