తెలంగాణ:ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు..
- July 06, 2019
తెలంగాణలో ఇంజినీరింగ్ కాలేజీల రుసుములు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఫీజులు మూడేళ్లపాటు అమల్లో ఉండనున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో 103 ఇంజినీరింగ్ కాలేజీలకు పూర్తి స్థాయి రుసుములు ఖరారు చేశారు. హైకోర్టును ఆశ్రయించిన 80 కాలేజీలతో పాటు.. టీఏఎఫ్ఆర్సీ సిఫార్సు చేసిన మరో 20 కాలేజీలకు ఫీజులను నిర్దారిస్తూ విద్యా శాఖ జీవో జారీ చేసింది. మిగతా 103 ఇంజినీరింగ్ కాలేజీల్లో తాత్కాలికంగా 15 నుంచి 20 శాతం పెంచారు. ప్రతిపాదిత ఫీజు 50వేలకు మించిన కాలేజీలకు ప్రస్తుత రుసుములో 15 శాతం.. ప్రతిపాదిత రుసుము 50 వేలు లేదా అంతకన్నా తక్కువగా ఉంటే ప్రస్తుత ఫీజులో 20 శాతం తాత్కాలికంగా పెంచారు. తాజా పెంపుతో రాష్ట్రంలో 22 ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజు లక్ష రూపాయలకు పైగా చేరింది. అత్యధికంగా హైదరాబాద్లోని సీబీఐటీలో లక్ష 34వేల రూపాయల ఫీజు ఖరారైంది. కనీస ఫీజు 35 వేల రూపాయలుగా పేర్కొన్నారు. దీంతో ఇన్ని రోజులుగా వాయిదా పడిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







