తెలంగాణ:ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు..
- July 06, 2019
తెలంగాణలో ఇంజినీరింగ్ కాలేజీల రుసుములు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఫీజులు మూడేళ్లపాటు అమల్లో ఉండనున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో 103 ఇంజినీరింగ్ కాలేజీలకు పూర్తి స్థాయి రుసుములు ఖరారు చేశారు. హైకోర్టును ఆశ్రయించిన 80 కాలేజీలతో పాటు.. టీఏఎఫ్ఆర్సీ సిఫార్సు చేసిన మరో 20 కాలేజీలకు ఫీజులను నిర్దారిస్తూ విద్యా శాఖ జీవో జారీ చేసింది. మిగతా 103 ఇంజినీరింగ్ కాలేజీల్లో తాత్కాలికంగా 15 నుంచి 20 శాతం పెంచారు. ప్రతిపాదిత ఫీజు 50వేలకు మించిన కాలేజీలకు ప్రస్తుత రుసుములో 15 శాతం.. ప్రతిపాదిత రుసుము 50 వేలు లేదా అంతకన్నా తక్కువగా ఉంటే ప్రస్తుత ఫీజులో 20 శాతం తాత్కాలికంగా పెంచారు. తాజా పెంపుతో రాష్ట్రంలో 22 ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజు లక్ష రూపాయలకు పైగా చేరింది. అత్యధికంగా హైదరాబాద్లోని సీబీఐటీలో లక్ష 34వేల రూపాయల ఫీజు ఖరారైంది. కనీస ఫీజు 35 వేల రూపాయలుగా పేర్కొన్నారు. దీంతో ఇన్ని రోజులుగా వాయిదా పడిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







