15వ దలైలామాగా పుట్టపర్తి స్కూలు విద్యార్థి..
- July 09, 2019
తన వారసుడు భారత్లోనే ఉన్నాడని 14వ దలైలామా గత మార్చిలో వ్యాఖ్యానించారు. ఆయన అన్నట్టుగానే అనంతపురం జిల్లా పుట్టపర్తి సత్యసాయి స్కూల్లో చదివే విద్యార్థి 15వ దలైలామాగా ఎంపికయ్యాడు. 7వ తరగతి చదువుతున్న దావావంగ్డిని పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్కు చెందిన వాడు. తల్లిదండ్రులు ప్రేమవంగ్డి, పంజూరాయ్. ప్రస్తుత 14వ బౌద్ధగురువు దలైలామా దావావంగ్డిని వివిధ కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించి అతడిని ఎంపిక చేశారు. బాలుని తల్లిదండ్రులను ఒప్పించిన బౌద్ద గురువులు అతడిని తమతో పాటు తీసుకువెళ్లారు. మైసూరు సమీపంలోని బైలుగుప్పే (గోల్డెన్ టెంపుల్) బౌద్ధారామంలో 15 సంవత్సరాలు శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయ్యాక వంగ్డి దలైలామాగా బాధ్యతలు స్వీకరిస్తారు. తనను సాయిరాం అని పిలిస్తే పలుకుతానని వంగ్డీ స్నేహితులకు చెప్పి వీడ్కోలు తీసుకున్నాడు. దలైలామా అస్తమించిన తరువాత కూడా తిరిగి అంతకుముందున్న వారి ఆత్మలో ప్రవేశిస్తారని బౌద్ధుల నమ్మకం. కాగా, 15వ దలైలామా భారత్లో పుడతారని 14వ దలైలామా చెప్పిన వ్యాఖ్యలను చైనా తప్పుపడుతోంది. భారతీయులను కాకుండా వేరేవారిని నియమించాలనేది చైనా అభిప్రాయం. అయితే ఇప్పుడు నియమించిన 15వ దలైలామా దావావంగ్డి నియామకాన్ని చైనా ప్రభుత్వం అంగీకరించిందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







