జమ్జమ్ బ్యాన్పై ఎయిర్ ఇండియా క్షమాపణ
- July 09, 2019
యూఏఈ: జమ్జమ్ హోలీ వాటర్ విషయమై ఎయిర్ ఇండియా, ప్రయాణీకులకు క్షమాపణ చెప్పింది. పవిత్ర జలంగా భావించే జమ్జమ్ వాటర్ని ఎయిర్ ఇండియా విమానాల్లో నిషేధించడం వివాదాస్పదమయ్యింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా, ట్విట్టర్ వేదికగా క్షమాపణ చెప్పింది. ఇకపై ఎలాంటి ఇబ్బందులూ లేకుండా జమ్జమ్ వాటర్ని ప్రయాణీకులు తీసుకెళ్ళవచ్చునని పేర్కొంది. తమకు కేటయించబడిన బ్యాగేజ్ పరిమితిలో జమ్జమ్ వాటర్ని కూడా తీసుకెళ్ళేందుకు అనుమతిస్తున్నామనీ, ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందులైనా తలెత్తితే ప్రయాణీకులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపింది ఎయిర్ ఇండియా. కాగా, జమ్జమ్ వాటర్ బ్యాన్పై భారత వలసదారులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, జెడ్డా నుంచి ఇండియాకి డైరెక్ట్గా పవిత్ర జలాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి, ఇక్కడ ఫిలిగ్రిమ్స్కి ప్రత్యేకంగా అందించాలనే ప్రతిపాదన 2014లోనే వచ్చిందని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు పేర్కొన్నారు. అయితే, అది అమల్లో వుందో లేదో మాత్రం చెప్పలేదు. తమ బంధువులకు పవిత్ర జలాన్ని ఇవ్వడం మక్కా వెళ్ళి వచ్చే ప్రయాణీకులకు ఆనవాయితీ.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







