దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్: చెరో మిలియన్ డాలర్లు గెల్చుకున్న ఇద్దరు భారతీయులు
- July 09, 2019
దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ర్యాఫిల్లో ఇద్దరు భారతీయులు చెరో 1 మిలియన్ డాలర్లు గెల్చుకున్నారు. ఇందులో ఒకరు జయా గుప్తా కాగా, ఆమె వయసు 71 ఏళ్ళు. గత ఇరవయ్యేళ్ళుగా ఆమె టిక్కెట్ కొనుగోలు చేస్తూనే వున్నారు. ఇన్నాళ్ళకు ఆమెకు అదృష్టం వరించింది. పూణేలో వుంటోన్న తన తల్లిని కలిసేందుకు మే 10న ఇండియాకి ఆమె వెళ్ళగా, ఈ క్రమంలో ఆమె కొనుగోలు చేసిన టిక్కెట్కి బహుమతి దక్కింది. టిక్కెట్ కొనడం తనకు హాబీ అనీ, ఎప్పుడూ తనకు బహుమతి తగల్లేదనీ, ఇది ఊహించని విషయమని ఆమె చెప్పారు. మరోపక్క, 37 ఏళ్ళ రవి రామ్చంద్ కూడా 1 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్నారు. 14 ఏళ్ళుగా దుబాయ్లో వుంటోన్న రవి రామ్చంద్, గార్మెంట్ బిజినెస్ నిర్వహిస్తున్నారు. గత పదేళ్ళుగా ఆయన కూడా టిక్కెట్స్ కొనుగోలు చేస్తున్నారు. ఈద్ సెలవుల సందర్భంగా క్రొయేషియాకి వెళుతూ లక్కీ టిక్కెట్ని కొనుగోలు చేసినట్లు చెప్పారాయన.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







