ప్రపంచకప్-2023 భారత్ లోనే
- July 16, 2019
ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా చూసిన ప్రపంచకప్ సమరం ఎట్టకేలకు ముగిసింది. రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులు ఆత్రుతగా చూసిన 2019 ప్రపంచకప్ను 44ఏళ్ల తర్వాత క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ ఎత్తుకెళ్లింది. ఇదిలా ఉంటే 2023 ప్రపంచకప్కు కూడా వేదికను సిద్ధం చేశారు నిర్వాహకులు. 2023 ప్రపంచ కప్కి గాను ఇండియా వేదికగా నిలుస్తుండగా.. షెడ్యుల్ను కూడా ఖరారు చేసింది.
2023 ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మార్చ్ 26వ తేదీ వరకు వరల్డ్ కప్ని నిర్వహించనున్నారు. గతంలో భారత్ ప్రపంచ కప్కి మూడు సార్లు ఆతిధ్యం ఇచ్చింది. 1987, 1996, 2011లో ఆతిధ్యం ఇచ్చింది. అయితే పొరుగు దేశాల అయిన బంగ్లాదేశ్ , శ్రీలంకలతో కలిసి భారత్ ప్రపంచ కప్కి ఆతిధ్యం ఇచ్చింది. కానీ ఈసారి మాత్రం ఒక్క భారత్ లోనే మొత్తం వరల్డ్ కప్ను నిర్విహించనున్నారు.
సెంటిమెంట్ ప్రకారం గత మూడు పర్యాయాలుగా ఎవరు ఆతిధ్యం ఇస్తే వాళ్లే కప్ గెలుస్తుండగా.. రాబోయే వరల్డ్ కప్ ఇండియా గెలుస్తుందా? అనే అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఐసీసీ నిభందలన ప్రకారం టాప్-8లో ఉండే జట్లు నేరుగా టోర్నీలో పాల్గొనే అవకాశం ఉండగా.. మిగిలిన రెండు స్థానాల కోసం 5జట్లు పోటి పడుతాయి.
కెరీర్ ఏదైనా ఓకే.. క్రీడలొద్దు : యువతకు నీషమ్ హితబోధ
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







