ప్రపంచకప్-2023 భారత్ లోనే
- July 16, 2019
ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా చూసిన ప్రపంచకప్ సమరం ఎట్టకేలకు ముగిసింది. రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులు ఆత్రుతగా చూసిన 2019 ప్రపంచకప్ను 44ఏళ్ల తర్వాత క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ ఎత్తుకెళ్లింది. ఇదిలా ఉంటే 2023 ప్రపంచకప్కు కూడా వేదికను సిద్ధం చేశారు నిర్వాహకులు. 2023 ప్రపంచ కప్కి గాను ఇండియా వేదికగా నిలుస్తుండగా.. షెడ్యుల్ను కూడా ఖరారు చేసింది.
2023 ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మార్చ్ 26వ తేదీ వరకు వరల్డ్ కప్ని నిర్వహించనున్నారు. గతంలో భారత్ ప్రపంచ కప్కి మూడు సార్లు ఆతిధ్యం ఇచ్చింది. 1987, 1996, 2011లో ఆతిధ్యం ఇచ్చింది. అయితే పొరుగు దేశాల అయిన బంగ్లాదేశ్ , శ్రీలంకలతో కలిసి భారత్ ప్రపంచ కప్కి ఆతిధ్యం ఇచ్చింది. కానీ ఈసారి మాత్రం ఒక్క భారత్ లోనే మొత్తం వరల్డ్ కప్ను నిర్విహించనున్నారు.
సెంటిమెంట్ ప్రకారం గత మూడు పర్యాయాలుగా ఎవరు ఆతిధ్యం ఇస్తే వాళ్లే కప్ గెలుస్తుండగా.. రాబోయే వరల్డ్ కప్ ఇండియా గెలుస్తుందా? అనే అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఐసీసీ నిభందలన ప్రకారం టాప్-8లో ఉండే జట్లు నేరుగా టోర్నీలో పాల్గొనే అవకాశం ఉండగా.. మిగిలిన రెండు స్థానాల కోసం 5జట్లు పోటి పడుతాయి.
కెరీర్ ఏదైనా ఓకే.. క్రీడలొద్దు : యువతకు నీషమ్ హితబోధ
తాజా వార్తలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







