52 ఫిలిగ్రిమ్స్తో వెళుతున్న బస్సుకి ప్రమాదం
- July 16, 2019
యూఏఈ: 52 మంది యాత్రీకులతో వెళుతున్న బస్సు యూఏఈలో ప్రమాదానికి గురయ్యింది. పవిత్ర మక్కాలో ఉమ్రా ప్రార్థనల కోసం యాత్రీకులు వెళుతున్నారు. ఒమన్కి చెందిన ప్రయాణీకులు ఈ బస్సులో వున్నట్లు తెలుస్తోంది. యూఏఈ హైవేపై మెటల్ బ్యారియర్ని ఈ బస్సు ఢీకొంది. అబుదాబీలోని షేక్ ఖలీఫా బిన్ జాయెద్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగిందనీ, అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. అబుదాబీ ట్రాఫిక్ పోలీస్ - డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ ఆఫ్ ఔటర్ రీజియన్ డైరెక్టర్ మాట్లాడుతూ, సంఘటన గురించిన సమాచారం అందుకోగానే, ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టామన్నారు. ఫిలిగ్రిమ్స్కి బస ఏర్పాట్లు చేశామనీ, ప్రత్యామ్నాయ ట్రాన్స్పోర్టేషన్ వారికి ఏర్పాటయ్యేవరకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనల్ని పాటించడం, స్పీడ్ లిమిట్స్కి లోబడి బస్సులు నడపడం ద్వారా ప్రమాదాలు నియంత్రించవచ్చునని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







