52 ఫిలిగ్రిమ్స్తో వెళుతున్న బస్సుకి ప్రమాదం
- July 16, 2019యూఏఈ: 52 మంది యాత్రీకులతో వెళుతున్న బస్సు యూఏఈలో ప్రమాదానికి గురయ్యింది. పవిత్ర మక్కాలో ఉమ్రా ప్రార్థనల కోసం యాత్రీకులు వెళుతున్నారు. ఒమన్కి చెందిన ప్రయాణీకులు ఈ బస్సులో వున్నట్లు తెలుస్తోంది. యూఏఈ హైవేపై మెటల్ బ్యారియర్ని ఈ బస్సు ఢీకొంది. అబుదాబీలోని షేక్ ఖలీఫా బిన్ జాయెద్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగిందనీ, అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. అబుదాబీ ట్రాఫిక్ పోలీస్ - డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ ఆఫ్ ఔటర్ రీజియన్ డైరెక్టర్ మాట్లాడుతూ, సంఘటన గురించిన సమాచారం అందుకోగానే, ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టామన్నారు. ఫిలిగ్రిమ్స్కి బస ఏర్పాట్లు చేశామనీ, ప్రత్యామ్నాయ ట్రాన్స్పోర్టేషన్ వారికి ఏర్పాటయ్యేవరకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనల్ని పాటించడం, స్పీడ్ లిమిట్స్కి లోబడి బస్సులు నడపడం ద్వారా ప్రమాదాలు నియంత్రించవచ్చునని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే