'పాడే ఉమారాణి' గారికి దుబాయ్ పోలీసుల సత్కారం
- January 06, 2016

వలసదారుల్లా అరబ్ దేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతున్న వారికి ఆపన్న హస్తం అందిస్తోన్న తెలుగు మహిళ పాడే ఉమారాణి గారి సేవల్ని గుర్తించిన దుబాయ్ పోలీసు ఉన్నతాధికారులు ఆమెను సత్కరించారు. దుబాయ్ పోలీసుల తరఫున ఉన్నతాధికారి మజీద్ అల్ సువేదీ ఉమారాణిని సత్కరించి, ఆమె సేవలకు గుర్తింపుగా ప్రశంసా పత్రాన్ని అందించారు. దుబాయ్లో దుర్భర జీవితం గడుపుతున్న తెలుగు పేదలకు చాలా సందర్భాల్లో దుబాయ్ పోలీసులు అండగా నిలిచారనీ, ఓ మహిళగా అక్కడ బాధపడ్తున్నవారిని ఆదుకునేందుకు తనవంతు సహాయం చేస్తున్నానని ఈ సందర్భంగా ఉమారాణి గారు చెప్పారు. ఉషారాణి పాడే గారు సికింద్రాబాద్ నుంచి వెళ్ళి దుబాయ్లో స్థిరపడ్డారు. ఎవరు కష్టాల్లో ఉన్నా తక్షణం స్పందించే ఉమారాణి గారు, దుబాయ్లో తెలుగువారికి అందిస్తున్న సామాజిక సేవను అక్కడివారు కొనియాడుతున్నారు. అలాగే దేశం కాని దేశంలో మనవారిని ఆదుకుంటున్న ఉమారాణి గారికి స్వదేశంలోనూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
మాగల్ఫ్.కామ్ టీం తరపున ఉమారాణి గారికి ప్రత్యేక అభినందనలు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







