ఐష్.. మా లక్కీ ఛార్మ్.. ఐశ్వర్య రాయ్ మళ్ళీ..
- July 24, 2019
రెండు నెలలపాటు స్థబ్ధుగా ఉంచిన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ మళ్ళీ తెరిచారు. జైపూర్ పింక్ పాంథర్ జట్టుకు శుభాకాంక్షలు చెబుతూ భర్త అభిషేక్ మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు తీసిన స్క్రీన్షాట్స్ను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ‘పింక్ పాంథర్స్.. గాడ్ బ్లెస్’ అని క్యాప్షన్ కూడా జతపరిచారు. సోమవారం ముంబయిలో ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్ జట్టుతో యూ ముంబా టీమ్ తలపడింది. రసవత్తరంగా సాగిన మ్యాచ్లో పింక్ పాంథర్స్జట్టు ముంబాయిపై గెలుపొందింది. ఈ సందర్భంగా అభిషేక్ ఫోటోను జతచేసి ఆ జట్టుకు విషెస్ తెలిపింది. దీనికి అభిషేక్ స్పందిస్తూ.. ‘ఐష్.. మా లక్కీ ఛార్మ్’ అంటూ ఐశ్వర్యను పొగుడుతూ మరో పోస్ట్ పెట్టారు.
ప్రస్తుతం ఐశ్వర్య రాయ్ ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్ సెల్వం’ అనే తమిళ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. చోళ సామ్రాజ్యం నేపథ్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఐశ్వర్య.. రాణి నందిని పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్లోని పలు చిత్రాల్లో కూడా నటించేందుకు సైన్ చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







