బ్రెజిల్లో పట్టపగలే భారీ దోపిడీ
- July 26, 2019సావో పాలో: దక్షిణ అమెరికా బ్రిజిల్లో పట్టపగలే భారీ దోపిడి జరిగింది. పోలీసు దుస్తులు వేసుకున్న కొందరు దుండగులు ఓ ట్రక్కులో ఎయిర్పోర్టుకు వచ్చారు.విమానాశ్రయం లోపలికి చొరబడి ఆయుధాలతో బెదిరించి ఇద్దరు సిబ్బందిని బందీగా తీసుకున్నారు. అక్కడి నుంచి కార్గో వద్దకు వెళ్లి విలువైన లోహాలను తమ ట్రక్కులో నింపుకొని పరారయ్యారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి. విమానాశ్రయం నుంచి మొత్తం 750 కిలోల బంగారం, ఇతర విలువైన లోహాలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే దొంగలు దోచుకెళ్లిన లోహాల విలువ 40 మిలియన్ డాలర్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 276కోట్లకుపైగే ఉండోచని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?