లిబియాలో దారుణం..150 మృతి!
- July 26, 2019
లిబియా:లిబియా అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది ఉగ్రవాదం.. ఆకలి కేకలు, అంతర్గత పోరు కేరాఫ్ అడ్రస్. అక్కడ ప్రతిరోజూ ఏదో ఒక గడవలు జరుగుతూనే ఉంటాయి. ఆ దేశంలో జరుగుతున్న అల్లర్ల వల్ల ఎంతో ప్రాణాలు హరిస్తున్నాయి. చాలా మంది ఆ దేశంలో ఉండలేక వివిధ ప్రదేశాలకు వలస వెళ్లడం గమనిస్తూనే ఉన్నాం.
బతుకు దెరువు కోసం వలసబాట పట్టిన లిబియా వాసుల పడవ ప్రయాణం మరోమారు విషాదాంతమైంది. పొట్టచేత పట్టుకుని వలసబాట పడుతున్న లిబియన్లు అకారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా లిబియా నుంచి యూరప్కు 250 మందితో వెళ్తున్న పడవ మధ్యదరా సముద్రంలో ప్రమాదవశాత్తు మునిగిపోయింది.
ఈ ప్రమాదంలో 150 మంది నీటిలో మునిగి చనిపోయారు..145 మందిని రక్షించామని అంతర్జాతీయ వలసదారుల సంస్థ తెలిపింది. తాజాగా లిబియాలో ఇప్పటి వరకు జరిగిన పడవ ప్రయాణాల్లో 2,297 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్టు ఐక్యరాజ్య సమితి తెలిపింది. తమ ప్రాణాలు లిబియాలోనే పోతున్నాయనుకుంటే...ఇలాంటి ప్రమాదాల వల్ల కూడా ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







