లిబియాలో దారుణం..150 మృతి!
- July 26, 2019లిబియా:లిబియా అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది ఉగ్రవాదం.. ఆకలి కేకలు, అంతర్గత పోరు కేరాఫ్ అడ్రస్. అక్కడ ప్రతిరోజూ ఏదో ఒక గడవలు జరుగుతూనే ఉంటాయి. ఆ దేశంలో జరుగుతున్న అల్లర్ల వల్ల ఎంతో ప్రాణాలు హరిస్తున్నాయి. చాలా మంది ఆ దేశంలో ఉండలేక వివిధ ప్రదేశాలకు వలస వెళ్లడం గమనిస్తూనే ఉన్నాం.
బతుకు దెరువు కోసం వలసబాట పట్టిన లిబియా వాసుల పడవ ప్రయాణం మరోమారు విషాదాంతమైంది. పొట్టచేత పట్టుకుని వలసబాట పడుతున్న లిబియన్లు అకారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా లిబియా నుంచి యూరప్కు 250 మందితో వెళ్తున్న పడవ మధ్యదరా సముద్రంలో ప్రమాదవశాత్తు మునిగిపోయింది.
ఈ ప్రమాదంలో 150 మంది నీటిలో మునిగి చనిపోయారు..145 మందిని రక్షించామని అంతర్జాతీయ వలసదారుల సంస్థ తెలిపింది. తాజాగా లిబియాలో ఇప్పటి వరకు జరిగిన పడవ ప్రయాణాల్లో 2,297 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్టు ఐక్యరాజ్య సమితి తెలిపింది. తమ ప్రాణాలు లిబియాలోనే పోతున్నాయనుకుంటే...ఇలాంటి ప్రమాదాల వల్ల కూడా ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!