కిలిమంజారోని అధిరోహించనున్న 9 మంది షార్జా బాలికలు
- July 26, 2019షార్జాకి చెందిన 9 మంది బాలికలు ప్రపంచంలోనే అత్యంత సాహసోపేతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 'వరల్డ్ మోస్ట్ డేరింగ్ మౌంటెయిన్ అడ్వెంచర్' ఆగస్ట్లో జరగనుంది. కాగా, రెండోసారి సజయా యంగ్ లేడీస్ ఆఫ్ షార్జా (ఎస్వైఎల్), మౌంటెనీరింగ్ ఎక్స్పెడిషన్ని నిర్వహిస్తోంది. ఆఫ్రికాలోని అత్యున్నత శిఖరమైన మౌంటెయిన్ కిలిమంజారోని ఈసారి అధిరోహించనుంది బాలికల బృందం. శారీరకంగా దృఢంగా వుండడమే కాదు, మానసికంగానూ ధృఢంగా వుంటేనే ఈ సాహసం సాధ్యమవుతుంది. గత ఏడాది ఇదే సమయంలో తొలి గ్రూప్ ఎస్వైఎల్ క్లయింబర్స్ విజయవంతంగా అట్లాస్ రేంజ్లోని మౌంట్ టౌబ్కాల్ని అధిరోమించారు. కఠినతరమైన శిక్షణతోపాటు, చాలా జాగ్రత్తలు తీసుకోవడం ఇందులో అతి ముఖ్యమైన ప్రక్రియ. ఎస్వైఎల్ డైరెక్టర్ షేకా ఐషా ఖాలిద్ మాట్లాడుతూ, వన్ టు వన్ సెషన్స్ ఈ ట్రైనింగ్లో కీలకమని చెప్పారు.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు