కిలిమంజారోని అధిరోహించనున్న 9 మంది షార్జా బాలికలు
- July 26, 2019
షార్జాకి చెందిన 9 మంది బాలికలు ప్రపంచంలోనే అత్యంత సాహసోపేతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 'వరల్డ్ మోస్ట్ డేరింగ్ మౌంటెయిన్ అడ్వెంచర్' ఆగస్ట్లో జరగనుంది. కాగా, రెండోసారి సజయా యంగ్ లేడీస్ ఆఫ్ షార్జా (ఎస్వైఎల్), మౌంటెనీరింగ్ ఎక్స్పెడిషన్ని నిర్వహిస్తోంది. ఆఫ్రికాలోని అత్యున్నత శిఖరమైన మౌంటెయిన్ కిలిమంజారోని ఈసారి అధిరోహించనుంది బాలికల బృందం. శారీరకంగా దృఢంగా వుండడమే కాదు, మానసికంగానూ ధృఢంగా వుంటేనే ఈ సాహసం సాధ్యమవుతుంది. గత ఏడాది ఇదే సమయంలో తొలి గ్రూప్ ఎస్వైఎల్ క్లయింబర్స్ విజయవంతంగా అట్లాస్ రేంజ్లోని మౌంట్ టౌబ్కాల్ని అధిరోమించారు. కఠినతరమైన శిక్షణతోపాటు, చాలా జాగ్రత్తలు తీసుకోవడం ఇందులో అతి ముఖ్యమైన ప్రక్రియ. ఎస్వైఎల్ డైరెక్టర్ షేకా ఐషా ఖాలిద్ మాట్లాడుతూ, వన్ టు వన్ సెషన్స్ ఈ ట్రైనింగ్లో కీలకమని చెప్పారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







