ఫేక్‌ మునిసిపాలిటీ ఎంప్లాయీ దొంగతనం

- July 27, 2019 , by Maagulf
ఫేక్‌ మునిసిపాలిటీ ఎంప్లాయీ దొంగతనం

కువైట్‌: ఆసియా వలసదారుడొకరు, గుర్తు తెలియని వ్యక్తి మునిసిపాలిటీ ఎంప్లాయీనని చెప్పి 200 కువైటీ దినార్స్‌ తన వద్ద దోచుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జహ్రా ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెక్యూరిటీ ఫోర్సెస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, వాహనం నుంచి బాధితుడ్ని బలవంతంగా దించిన నిందితుడు తనను తాను కువైట్‌ మునిసిపాలిటీ ఎంప్లాయీగా చెప్పి దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితుడి నుంచి వ్యాలెట్‌ లాక్కున్న నిందితుడు, డబ్బు తీసుకుని అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్‌ చేస్తామంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com