వేడి గాలులతో ఐరోపా భగ భగ...
- July 27, 2019
యూరోప్:వేడిగాలులతో ఐరోపా భగభగలాడుతోంది. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గత రికార్డులను బద్దలు కొడుతు న్నాయి. ముఖ్యంగా గురువారం నాడు జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, నెదర్లాండ్స్ తదితర దేశాలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయినట్లు ఆయా దేశాల వాతావరణ విభాగాలు వెల్లడించాయి. వాతావరణ మార్పులతో భూమండలం క్రమంగా వేడెక్కుతోందంటూ శాస్త్రవేత్తలు హెచ్చరించిన నెల రోజుల వ్యవధిలో అత్యధిక స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావటం ఇది రెండోసారి. సహారా ఎడారి ప్రాంతం నుండి ఉత్తర దిశగా వీస్తున్న వేడిగాలులు వాతావరణంలో తేమను ఆవిరి చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఫ్రాన్స్, బ్రిటన్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయన్నారు. వృద్ధులు ఇళ్లు వీడి బయటకు రావద్దని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు. నగరాల్లో చిన్నారులు వేసవి తాపాన్ని తట్టుకునేం దుకు వాటర్ ఫౌంటెయిన్ల వైపు పరుగులు తీస్తు న్నారు. పారిస్ నగరంలో గురువారం మధ్యాహ్నం 42.6 డిగ్రీల సెల్షియస్ నమోదయింది. 1947 జులైలో నమోదయిన 40.4 డిగ్రీల సెల్షియస్ ఇప్పటివరకు ఉన్న అత్యధిక ఉష్ణోగ్రత. ఇప్పుడీ ఉష్ణో గ్రతలు ఆ రికార్డును బద్దలుకొట్టాయి. రుతువులు గతి తప్పడం, అతి వృష్టి, అనావృస్టి, ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోవడానికి హరితగృహ వాయువులే కారణమని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







