ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు..
- July 27, 2019
గత కొద్దిరోజులుగా సినిమా పరిశ్రమలో హీట్ రాజేసిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు హోరాహోరిగా సాగుతున్నాయి. ఇవాళ ఉదయం 8గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ మొదలైంది. మన ప్యానల్ కు, యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ ప్యానల్స్ కు మధ్య పోటీ నువ్వా- నేనా అన్నట్టు సాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగనుంది. అనంతరం సాయంత్రం 5గంటల కల్లా ఫలితాలు వెల్లడవుతాయి. ఎవరికి వారు విజయంపై ధీమాగా ఉన్నారు.
ఎగ్జిబీటర్స్, స్టూడియో యజమానులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ ప్రతినిధులు ఫిల్మ్ ఛాంబర్ లో సభ్యులుగా ఉన్నారు. నిర్మాతలే ఎక్కువమంది ఇందులో పదవుల కోసం పోటీపడుతున్నారు. యాక్టీవ్ ప్రొడ్యూసర్ ప్యానల్ నుంచి దామోదర ప్రసాద్, బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, డీవీవీ దానయ్య, సాయి కొర్రపాటి, దిల్ రాజు, నాగవంశీ తదితరులు రేసులో ఉన్నారు. వీరికి పోటీగా వైవీఎస్ చౌదరి, ప్రసన్నకుమార్, నట్టికుమార్, వి.సాగర్, శివకుమార్ లు రంగంలో దిగారు. పెద్ద పెద్ద నిర్మాతలు పోటీలో ఉండడంతో గతంలో కంటే ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా ఏసియన్ అధినేత నారాయణదాస్ నారంగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన పదవుల కోసం పోలింగ్ జరుగుతోంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







