సౌదీ అరేబియా:'ఎబోలా' భయంతో వీసాలు రద్దు
- July 29, 2019
రియాద్: కాంగో దేశంలో 'ఎబోలా వైరస్' వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉంది. ఈ నేపథ్యంతో ఆ దేశానికి చెందిన హజ్ యాత్రికుల వీసాలను రద్దు చేస్తున్నట్టు సౌదీ అరేబియా నిర్ణయించింది. కాంగోలోని కీవు, ఇటూరి ప్రాంతాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉందని ఈ ప్రాంతాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్యూఎచ్ఓ) ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటి వరకూ దాదాపు 1700 మంది మరణించినట్టు కాంగో ఆర్యోగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సందర్భంలోనే వచ్చే నెలలో సౌదీ అరేబియాలో జరిగే హజ్యాత్రను సందర్శించడానికి కాంగోలోని చాలామంది ముస్లింలు హజ్ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ దేశీయులు రావడం వల్ల ఇతర దేశ యాత్రికులు ఎలోబా వైరస్ó సోకే ప్రమాదముందనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌదీ విదేశాంగ మంత్రి అల్ జాజీరా తెలిపారు. కాంగో సహా గునియా, సియార్రాలీన్ , లిబిరియా దేశాలకు చెందిన యాత్రికుల వీసాలను కూడా రద్దు చేస్తున్నట్టు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. గతంలోనూ పశ్చిమాఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్వ్యాప్తి చెంది దాదాపు 11వేల మంది చనిపోయిన సందర్భంలో ఆ దేశీయుల వీసాలనూ రద్దు చేసిన విషయం తెలిసిందే..
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







