దుబాయ్లో 16 ఏళ్ల బాలుడిపై కీచక పర్వం..
- July 29, 2019దుబాయ్లో దారుణం చోటుచేసుకుంది. 16ఏళ్ల బాలుడిపై ఐదుగురు పురుషులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కీచక పర్వం సంచలనం సృష్టించింది. ఐదుగురు పురుషులు ఓ విల్లాకు 16 ఏళ్ల బాలుడిని తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 19 వుంచి 25 ఏళ్ల వయస్సున్న ఐదుగురు నిందితులను పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు.
ఈ కేసు విచారణలో భాగంగా.. 16ఏళ్ల బాలుడిని కారులో ఎక్కించుకుని విల్లాకు తీసుకెళ్లారని.. ఏప్రిల్ 18వ తేదీన ఆ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని న్యాయవాదులు ఆరోపించారు. ఈ ఘటన అల్ ఖుసైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్నాప్ చాట్ ద్వారా స్నేహితుడైన ఓ వ్యక్తి కలవమని పిలవడంతో వెళ్లానని బాధితుడు వాపోయాడు.
అలా వెళ్ళిన తనను స్నాప్ చాట్ ద్వారా పరిచయమైన వ్యక్తి స్నేహితుడిని పంపి తనకు తీసుకెళ్లాడని చెప్పాడు. అక్కడ నుంచి ఐదుగురు తనను విల్లాకు తీసుకెళ్లారని.. అక్కడ ఓ గదలో నిర్భంధించి అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపాడు.
కత్తులతో బెదిరించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని.. మరుసటి రోజు ఇంటికి తిరిగి పంపారని బాధితుడు చెప్పాడు. ఈ తతంగాన్ని వీడియో తీసి బెదిరించారని.. కానీ ఇంటికొచ్చిన ఆ యువకుడు ఈ విషయాన్ని తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాగోతం బయటపడింది.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్