కెజిఎఫ్ 2 లో బాలీవుడ్ హీరో..
- July 29, 2019
లాస్ట్ ఇయర్ కన్నడ నుంచి వచ్చిన కె.జి.ఎఫ్ చిత్రం దక్షిణాది ప్రేక్షకులను కాదు, బాలీవుడ్ ఆడియన్స్ ని కూడా మెస్మరైజ్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని బాషల్లో కలిపి 250 కోట్లు కొల్లగొట్టిన కె.జి.ఎఫ్ మూవీకి, ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పార్ట్ 2లో స్టార్ కాస్టింగ్ కూడా ఉండబోతుంది. అందులో భాగంగా బాలీవుడ్ నుంచి ఓ క్రేజీ స్టార్ ని, మెయిన్ విలన్ గా తీసుకున్నారు కె.జి.ఎఫ్ మేకర్స్.
బాహుబలి సిరీస్ తర్వాత టోటల్ నేషనల్ వైడ్ గా క్రేజ్ ని, సక్సెస్ ని సాధించిన సౌత్ సినిమా KGF. తక్కువ బడ్జెట్ లోనే సినిమాలు తీసే కన్నడ పరిశ్రమలో KGF అత్యంత ఎక్కువ బడ్దెట్ తో తెరకెక్కింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా రూపొందిన ఈ మాస్ ఎంటర్టైనర్, ఎవరూ ఊహించలేని బజ్ తో, అదిరిపోయే కలెక్షన్లు సాధించింది. ఓ కన్నడ సినిమా వంద కోట్లు సాధించడమే ఎక్కువనుకుంటే, ఏకంగా 250 కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది. అందులో హిందీ వెర్షన్ నుంచి 50 కోట్లకు పైగా కలెక్షన్లు రావడం హైలైట్. కన్నడ వెర్షన్ కి 125 కోట్లు వరకు వస్తే.. మిగతావి తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్ నుంచి వచ్చాయి.
KGFకి సీక్వెల్ గా KGF చాప్టర్ 2 పేరుతో త్వరలోనే మరో సినిమా రాబోతుంది. ఫస్ట్ పార్ట్ కి ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ లో హైలైట్ గా నిలిచిన మాస్ ఎలిమెంట్స్ ని, సెకండ్ పార్ట్ లో మరింత ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. యష్ ఈ సినిమా కోసం మరింతగా కష్ట పడుతున్నాడు. అయితే ఫస్ట్ పార్ట్ సక్సెస్ ని బట్టీ, ఈ సారి దానికి రెట్టింపు ఉండేలా స్టార్ కాస్ట్ ని తీసుకుంటున్నారు. స్టోరీ ప్రకారం గరుడ బాబాయి అధీరానే సెకండ్ పార్ట్ లో విలన్. ఈ పాత్ర కోసం బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ ని తీసుకున్నారు. సోమవారం సంజయ్ దత్ పుట్టినరోజు. అందుకే తన లుక్ తో ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. సంజయ్ దత్ వల్ల బాలీవుడ్లో సినిమాపై మరింత అంచనాలు పెరగడం ఖాయం అని చెప్పాలి. మొత్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రాబోతున్న KGF పార్ట్ 2, ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







