నేడు భారత దేశవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల బంద్
- July 31, 2019
భారత దేశవ్యాప్తంగా ఇవాళ ప్రైవేటు ఆసుపత్రులు బంద్ పాటిస్తున్నాయి. అత్యవసర సేవలు మినహా.. 24 గంటల పాటు ఇతర వైద్యసేవలు లభించవు. లోక్సభలో జాతీయ వైద్య కమిషన్ బిల్లును ఆమోదించినందుకు నిరనసగా.. 24 గంటల బంద్కు పిలుపునిచ్చింది భారతీయ వైద్యసంఘం. ఈ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. బంద్కు ఐఎంఏ తెలుగు రాష్ట్రాల కమిటీలు మద్దతు తెలిపాయి. జూనియర్ వైద్యులు సైతం మద్దతు తెలిపారు.
వైద్యసేవల నిలిపివేతతో రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్నామ్నాయ ఏర్పాటు చేశాయి. ప్రభుత్వ వైద్యులందరూ ఇవాళ విధులకు కచ్చితంగా హాజరు కావాలని ఆదేశించాయి. పీజీ వైద్య విద్యార్థులు విధుల్లో లేని లోటు కనిపించకుండా 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకొచ్చే రోగులకు చికిత్స లభించక ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపాయి.
తాజా వార్తలు
- BAPS హిందూ మందిర్ రక్షా బంధన్ ఉత్సవాలు..10 వేల రాఖీలు అందజేత
- ఖతార్ లో తగ్గుముఖం పట్టిన కరోనా వ్యాప్తి
- మహిళ పోలీసుపై దాడి చేసిన మహిళకు జైలు శిక్ష
- TSRTC బంపరాఫర్: 12 ఏళ్ల వరకు ఆ చిన్నారులకు ఉచిత బస్సు ప్రయాణం
- ఎయిర్ ఇండియా స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్.. Dh330కే వన్-వే టిక్కెట్లు
- వెదర్ రిపోర్టును తప్పుగా పబ్లిస్ చేస్తే.. OMR50,000 జరిమానా: ఒమన్
- ఘనంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీడ్కోలు సమావేశం
- గృహ కార్మికుల పరీక్షలు ప్రైవేటీకరణ
- ప్రజల కోసం సలాలా గ్రాండ్ మాల్ తెరవబడింది
- షేక్ ఇబ్రహీం బిన్ మొహ్మద్ అవెన్యూ లో నూతన ట్రాఫిక్ సిగ్నల్