ఆగస్ట్ 1నుంచి అమల్లోకి వస్తున్న ఎస్బీఐ బ్యాంకు కొత్త రూల్స్..
- August 01, 2019
వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలందిస్తున్న దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త నిబంధనలు ఆగస్ట్ 1నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ఖాతాదారులకు కొంత నష్టం మరికొంత లాభం ఉండబోతోంది. మరి ఆ కొత్త రూల్స్ ఏంటో ఓసారి చూసేద్దాం..
ఎస్బీఐ తన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఆగస్ట్ 1నుంచే అమలులోకి వచ్చింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు బ్యాంక్ ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ చార్జీలు తీసివేసి ఉచితంగా అందిస్తోంది. ఇకపై ఈ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. బ్యాంక్ సెలవలు, ఆదివారాల్లోనూ ఐఎంపీఎస్ మార్గంలో ఇతరులకు బదిలీ చేయవచ్చు. అయితే కేవలం రూ.1,000ల వరకు మాత్రమే ఉచిత సేవలు వర్తిస్తాయి. మరోవైపు స్టేట్ బ్యాంక్ ఎఫ్డీ రేట్లు తగ్గించింది. 20 నుంచి 75 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లలో కోత విధించింది. సవరించిన వడ్డీ రేట్లు ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







