శుభవార్త చెప్పిన శిల్పాశెట్టి
- August 01, 2019
బాలీవుడ్ భామ శిల్పాశెట్టి అభిమానులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే ‘నికమ్మ’ మూవీతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఇన్స్టా లో పోస్ట్ పెట్టారు. ” అవును, ఇది నిజం! 13 సంవత్సరాల నా సుదీర్ఘ విరామానికి ముగింపు పలుకుతున్నా.. త్వరలోనే నికమ్మ చిత్రంలో కనిపించబోతున్నాను. ఈ విషయం మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. అభిమన్యు, షిర్లేసేతియా వంటి ప్రతిభావంతులైన నటులతో కలిసి నటిస్తున్నందకు ఆనందంగా ఉంది. నాపై మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉండాలి ఇన్నాళ్ళుగా మీరు కురిపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు” అంటూ ఓ వార్తా పత్రిక క్లిప్పింగ్ను జత చేస్తూ ఇన్స్టా ఖాతలో ఓ పోస్ట్ పెట్టారు. 90 వ దశకంలో బాలీవుడ్ ఓ ఊపు ఊపిన పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి వ్యాపారవేత్త రాజ్కుంద్రాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ప్రస్తుతం ఓ కుమారుడు.
అనంతరం కొద్దిరోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు. భర్త రాజ్కుంద్రా ఓనర్గా వ్యవహరించిన రాజస్థాన్ రాయల్స్ టీం బాధ్యతలను చూసుకున్నారు. ఆ జట్టు ఆడే ప్రతి మ్యాచ్లో కనిపిస్తూ సందడి చేశారు. బిగ్ స్ర్ర్కిన్కు దూరమైన శిల్ప డిజిటల్ ప్లాట్ ఫామ్పై మెరిశారు. యోగా , తన ముద్దుల కుమారుడు వియాన్కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వాటిని అభిమానులతో పంచుకున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







