సైనిక శిబిరంపై హౌతీ సంస్థ దాడి.. 32 మంది మృతి
- August 03, 2019
యెమెన్ లో మిలటరీ పెరెడ్ రక్తసిక్తమైంది. సైనికుల శిబిరంపై హౌతీ సంస్థ దాడికి పాల్పడింది. ఈ దాడిలో దాదాపు 32మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. మిలటరీ పెరెడ్ పై హౌతీ మద్దతు దారులు కారుబాంబుతో ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడి ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్న హౌతీ పాల్పడిందని సౌదీ అరేబియా ఆరోపించింది. యెమెన్ ప్రధానమంత్రి మెయిన్ అబ్దుల్ మాలిక్ సయీద్ సైతం ఇదే అంశాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. మిలటరీ పెరెడ్ తోపాటు పోలీస్టేషన్ పై దాడికి పాల్పడిందని పేర్కొన్నారు. అయితే ఇక్కడ ప్రధానికి సౌదీ అరేబియా మద్దతు తెలుపుతుండగా… ఏర్పాటువాదులకు ఇరాన్ మద్దతుగా నిలుస్తోంది. దీంతో గత కొంతకాలంగా ఇరువర్గాలు దాడులకు దిగుతున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







