ఐఐఎఫ్ సదస్సుకు మంత్రి కేటీఆర్కు ఆహ్వానం..
- January 06, 2016
పారిస్లో ఈ నెల 18న జరిగే ఇండియా ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్ 2016 (ఐఐఎఫ్) సదస్సుకు హాజరు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. ఈ సమావేశానికి గౌరవ అతిథిగా హాజరై కీనోట్ అడ్రస్ ఇవ్వాలని మంత్రిని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫ్రాన్స్-ఇండియా (సీసీఐఎఫ్ఐ) కోరింది. ఈ మేరకు సీసీఐఎఫ్ఐ మంత్రి కేటీఆర్కు లేఖ రాసింది. ఈ సమావేశంలో 'ఇన్వెస్ట్మెంట్ అండ్ న్యూ గ్రోత్ డ్రైవర్స్' అనే అంశంపై మంత్రి కేటీఆర్ ప్రసంగించాలని సీసీఐఎఫ్ఐ చైర్మన్ డాన్ ఓక్నినే కోరారు.భారత్, ఫ్రాన్స్తోపాటు యూరోపియన్ యూనియన్లోని ఫ్రెంచ్ మాట్లాడే దేశాల మధ్య సంబంధాల అభివృద్ధి కోసం ఫోరం పనిచేస్తుందని పేర్కొన్నారు.
ఈ సదస్సుకు కేటీఆర్ హాజరై భారత దేశ బ్రాండ్ ఇమేజ్ను ఫ్రెంచ్ దేశాలకు పరిచ యం చేయాలని, రాష్ట్రంలో అభివృద్ధి అవకాశాలను వివరించాలని కోరారు. భారత్-ఫ్రాన్స్ సంబంధాల్లో పబ్లిక్-ప్రైవేటు, ప్రైవేటు-ప్రైవేటు వాణిజ్య సంబంధాల్లో ఉన్న అవకాశాలను ఈ సమావేశం చర్చిస్తుందని, ఇరు దేశాల్లోని పారిశ్రామిక అవకాశాలను పరస్పరం తెలియజేసేందుకు ఇది ఉపకరిస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







