ఐఐఎఫ్ సదస్సుకు మంత్రి కేటీఆర్కు ఆహ్వానం..
- January 06, 2016
పారిస్లో ఈ నెల 18న జరిగే ఇండియా ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్ 2016 (ఐఐఎఫ్) సదస్సుకు హాజరు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. ఈ సమావేశానికి గౌరవ అతిథిగా హాజరై కీనోట్ అడ్రస్ ఇవ్వాలని మంత్రిని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫ్రాన్స్-ఇండియా (సీసీఐఎఫ్ఐ) కోరింది. ఈ మేరకు సీసీఐఎఫ్ఐ మంత్రి కేటీఆర్కు లేఖ రాసింది. ఈ సమావేశంలో 'ఇన్వెస్ట్మెంట్ అండ్ న్యూ గ్రోత్ డ్రైవర్స్' అనే అంశంపై మంత్రి కేటీఆర్ ప్రసంగించాలని సీసీఐఎఫ్ఐ చైర్మన్ డాన్ ఓక్నినే కోరారు.భారత్, ఫ్రాన్స్తోపాటు యూరోపియన్ యూనియన్లోని ఫ్రెంచ్ మాట్లాడే దేశాల మధ్య సంబంధాల అభివృద్ధి కోసం ఫోరం పనిచేస్తుందని పేర్కొన్నారు.
ఈ సదస్సుకు కేటీఆర్ హాజరై భారత దేశ బ్రాండ్ ఇమేజ్ను ఫ్రెంచ్ దేశాలకు పరిచ యం చేయాలని, రాష్ట్రంలో అభివృద్ధి అవకాశాలను వివరించాలని కోరారు. భారత్-ఫ్రాన్స్ సంబంధాల్లో పబ్లిక్-ప్రైవేటు, ప్రైవేటు-ప్రైవేటు వాణిజ్య సంబంధాల్లో ఉన్న అవకాశాలను ఈ సమావేశం చర్చిస్తుందని, ఇరు దేశాల్లోని పారిశ్రామిక అవకాశాలను పరస్పరం తెలియజేసేందుకు ఇది ఉపకరిస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









