ఇండిగో నుంచి కొత్తగా మరో 24 విమానాలు

- January 06, 2016 , by Maagulf
ఇండిగో నుంచి కొత్తగా మరో 24 విమానాలు

సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉన్న దేశీయ విమానయాన సంస్థ ఇండిగో నుంచి కొత్తగా మరో 24 విమానాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. వీటిలో దిల్లీ తిరువనంతపురం మధ్య ప్రతిరోజు తిరిగే తొలి నాన్‌స్టాప్‌ సర్వీసు ఉంది. కొత్తగా వచ్చిన 24 విమానాలతో దేశంలో 39 నగరాల మధ్య ఇండిగో విమాన సర్వీసుల సంఖ్య మరింత పెరగనుంది. బెంగళూరు నుంచి విశాఖపట్నం, భువనేశ్వర్‌, అహ్మదాబాద్‌.. భువనేశ్వర్‌ నుంచి కోల్‌కతా, చెన్నై నుంచి తిరువనంతపురం మధ్య నాన్‌స్టాప్‌ సర్వీసులు తిరగనున్నాయి. దిల్లీతిరువనంతపురం మధ్య నాన్‌స్టాప్‌ సేవలు రేపటి నుంచే అందుబాటులోకి రానున్నాయి. విమాన ప్రయాణ ధరలు అందుబాటులో ఉండటంతో కేరళ వాసులకు దిల్లీ తిరువనంతపురం నాన్‌స్టాప్‌ సర్వీసుతో ఎక్కువ మేలు చేకూరనుందని ఇండిగో సంస్థ అధ్యక్షుడు ఆదిత్యఘోష్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com