'మన్మథుడు 2' ప్రీ రిలీజ్ వేడుక
- August 04, 2019
హైదరాబాద్: 'మన్మథుడు 2' సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ లో నిర్వహించిన ఈ వేడుకకు నటీనటులు నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, సీనియర్ నటి లక్ష్మి, అమల, వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్ తదితరులు హాజరయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ దర్శకత్వం వహించారు.ఆగస్టు నెల అంటే తనకు చాలా ఇష్టమని, ఇటీవలే 'బిగ్ బాస్' ప్రారంభమైందని, మన్మథుడు2 చిత్రం రిలీజ్ కాబోతోందని అన్నారు. ఇంకా ప్రేమకథా చిత్రంలో నటించడమేంటని చాలా మంది తనను అడిగారని, ఏ వయసులో నైనా ప్రేమించ వచ్చని చెప్పే ఫ్రెంచ్ కథ ఇది అని అన్నారు. ఈ చిత్రంలో తన సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్ గురించి నాగార్జున మాట్లాడుతూ, ఆమె గొప్ప నటి, ఆరోగ్యం గురించి ఆమె నుంచి చాలా నేర్చుకోవచ్చని చెప్పారు.
తాజా వార్తలు
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!







