'మన్మథుడు 2' ప్రీ రిలీజ్ వేడుక
- August 04, 2019హైదరాబాద్: 'మన్మథుడు 2' సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ లో నిర్వహించిన ఈ వేడుకకు నటీనటులు నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, సీనియర్ నటి లక్ష్మి, అమల, వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్ తదితరులు హాజరయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ దర్శకత్వం వహించారు.ఆగస్టు నెల అంటే తనకు చాలా ఇష్టమని, ఇటీవలే 'బిగ్ బాస్' ప్రారంభమైందని, మన్మథుడు2 చిత్రం రిలీజ్ కాబోతోందని అన్నారు. ఇంకా ప్రేమకథా చిత్రంలో నటించడమేంటని చాలా మంది తనను అడిగారని, ఏ వయసులో నైనా ప్రేమించ వచ్చని చెప్పే ఫ్రెంచ్ కథ ఇది అని అన్నారు. ఈ చిత్రంలో తన సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్ గురించి నాగార్జున మాట్లాడుతూ, ఆమె గొప్ప నటి, ఆరోగ్యం గురించి ఆమె నుంచి చాలా నేర్చుకోవచ్చని చెప్పారు.
తాజా వార్తలు
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్