ఇజ్రాయెల్‌ నుంచి గోదావరి వరదలపై సీఎం జగన్‌ సమీక్ష

- August 04, 2019 , by Maagulf
ఇజ్రాయెల్‌ నుంచి గోదావరి వరదలపై సీఎం జగన్‌ సమీక్ష

ఇజ్రాయెల్‌:రాష్ట్రంలోని గోదావరి వరదలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇజ్రాయెల్‌ పర్యటనలో ఉన్న జగన్‌ అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. గోదావరి జిల్లాల్లో సహాయ చర్యలు ఉధృతం చేయాలని ఆదేశించారు. బాధితులకు కిరోసిన్, ఆహారం పంపిణీ చేయాలని, గోదావరి ఉధృతిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని సూచించారు. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు సహాయ చర్యలు కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com