అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్ లో కీలక సూచనలు ఇచ్చిన మోడీ
- August 05, 2019
జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ ఫోన్ చేశారు.
ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత రాష్ట్రాల్లో పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ముఖ్యమంత్రులకు మోడీ సూచించారు.
కశ్మీర్పై నిర్ణయం నేపథ్యంలో తమకు కేంద్రం నుంచి హెచ్చరికలు అందినట్టు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ చెప్పారు. సైబరాబాద్ పరిధిలో 144 సెక్షన్ విధించినట్టు వివరించారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వబోమన్నారు. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ







