అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్ లో కీలక సూచనలు ఇచ్చిన మోడీ
- August 05, 2019
జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ ఫోన్ చేశారు.
ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత రాష్ట్రాల్లో పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ముఖ్యమంత్రులకు మోడీ సూచించారు.
కశ్మీర్పై నిర్ణయం నేపథ్యంలో తమకు కేంద్రం నుంచి హెచ్చరికలు అందినట్టు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ చెప్పారు. సైబరాబాద్ పరిధిలో 144 సెక్షన్ విధించినట్టు వివరించారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వబోమన్నారు. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







