ఆర్టికల్ 370 రద్దుపై స్పందించిన పాకిస్తాన్
- August 05, 2019
జమ్ము-కశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్తాన్ స్పందించింది. దీనిపై మాట్లాడిన పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ కురేషీ "ఆర్టికల్ 370 రద్దు చేయడంపై భారత్ చాలా ప్రమాదకరమైన ఆట ఆడింది. దీని ప్రభావం మొత్తం ప్రాంతంపై చాలా భయానకంగా ఉండచ్చు. ఇమ్రాన్ ఖాన్ ఈ అంశాన్ని పూర్తిగా చర్చల వైపు తీసుకెళ్లాలని భావించారు. కానీ భారత్ తన నిర్ణయంతో ఈ అంశాన్ని మరింత జటిలం చేసింది. కశ్మీరీలను ఇప్పటికే రాష్ట్రంలో బంధించారు. మేం ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లాం. ఇస్లామిక్ దేశాలకు కూడా దీని గురించి చెప్పాం. ముస్లింలు అందరూ కలిసి కశ్మీరీల సంక్షేమం కోసం ప్రార్థనలు చేయాలి. పాకిస్తాన్ పూర్తిగా కశ్మీరీలకు అండగా ఉంటుంది" అన్నారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







