డిగ్రీ చదివితే చాలు సాఫ్ట్వేర్ జాబ్.. నిరుద్యోగులను నిండా ముంచిన కంపెనీ
- August 07, 2019
విశాఖలో సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను నిండా ముంచిందో ఓ బోగస్ కంపెనీ. డిగ్రీ చదివితే చాలు, సాఫ్ట్ వేర్ ట్రైనింగ్ ఇచ్చి, ఉపాధి కల్పిస్తామంటూ చాలా మంది దగ్గర 9 నుంచి 15 వేల రూపాయల వసూలు చేశారు. అయితే ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయామని తెలుసుకున్న నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించారు.
విశాఖలో 6 నెలల కిందట షణ్ముఖరావు రైన్ బో టెక్నాలజీస్ పేరిట ఓ సంస్థను నెలకొల్పాడు. తొలుత ఇద్దరు హెచ్ఆర్ మేనేజర్లను రిక్రూట్ చేశాడు. ఆ తర్వాత నిరుద్యోగులను ఆకర్షించేందుకు సాఫ్ట్వేర్ జాబ్స్ అంటూ పెద్ద ఎత్తున పత్రికల్లో యాడ్స్ ఇచ్చాడు. వీటికి ఆకర్షితులై వచ్చిన వారికి హెచ్ఆర్ మేనేజర్లు ఇంటర్వ్యూలు నిర్వహించారు. సాలరీని బట్టి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పారు. యజమాని షణ్ముఖ రావు చెప్పినట్టు శిక్షణ కోసం హెచ్ఆర్ మేనేజర్లు ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ. 9 వేల నుంచి 15 వేల వరకు వసూలు చేశారు. సుమారు వంద మందికి పైగా నిరుద్యోగులకు తూతూ మంత్రంగా ట్రైనింగ్ ఇచ్చి, వెబ్ డిజైనర్, సాఫ్ట్వేర్ డెవలపర్స్, బ్యాక్ ఎండ్ ఎగ్జిక్యూటివ్ అనే పేర్లతో ఆఫర్ లెటర్లు ఇచ్చారు. అయితే రోజులు గడుస్తున్నా ఉద్యోగాల కోసం కబురు రాకపోవడంతో నిరుద్యోగులు హెచ్ఆర్ మేనేజర్లను నిలదీశారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే హెచ్ ఆర్ మేనేజర్లు సైతం తాము కూడా మోసపోయామంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు షణ్ముఖరావును అదుపులోకి తీసుకున్నారు. అయితే రైన్ బో టెక్నాలజీస్ అసలు ఓనర్ తాను కాదని ఆయన చెప్పాడు. వేరే యజమాని ఉన్నాడని తెలిపాడు. దీంతో నిరుద్యోగులను మోసం చేసిన అసలు సూత్రధారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







