ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన టీవీ5 స్టాఫ్ రిపోర్టర్
- August 12, 2019
రాజమండ్రి టీవీ5 స్టాఫ్ రిపోర్టర్ తాతాజీ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది. గత వారంరోజులుగా గోదావరి పరివాహక ప్రాంతంలోని దేవీపట్నం, కోనసీమ లంక గ్రామాల వరద బాధితుల కష్టాలపై.. ప్రమాదకర పరిస్థితుల్లోనూ నిర్భయంగా రిపోర్టింగ్ చేశాడు. వరద పరిస్థితులపై వాస్తవ చిత్రాన్ని బాహ్య ప్రపంచానికి తెలియచేశాడు. ఐతే.. నిన్న తాతాజీని దురదృష్టం వెంటాడింది. తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయడపడ్డ తాతాజీ ఈ ఉదయం మృతి చెందాడు.
టీవీ 5 రిపోర్టర్ తాతాజీ ద్విచక్రవాహనంపై నిడదవోలు వెళుతుండగా తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తాడేపల్లిగూడెంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమండ్రిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్రగాయాలు కావడంతో అప్పటికే బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు గుర్తించారు. తాతాజీని కాపాడేందుకు టీవీ5 యాజమాన్యం శతవిధాలా ప్రయత్నించింది. అయినా పరిస్థితి విషమించింది. శరీరం వైద్యానికి స్పందించలేదు. దీంతో ఉదయం మృతి చెందాడు. తాతాజీ మృతి పట్ల టీవీ5 యాజమాన్యం సంతాపం తెలిపింది.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







