లిబియాలోని పోలీసు శిక్షణ శిబిరంపై బాంబు దాడి

- January 07, 2016 , by Maagulf
లిబియాలోని పోలీసు శిక్షణ శిబిరంపై బాంబు దాడి

లిబియాలోని పోలీసు శిక్షణ శిబిరంపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 30 మంది దాకా గాయపడ్డారు. శిక్షణా కేంద్రంలో దాదాపు 400 మందికి పైగా పోలీసు శిక్షణ పొందుతున్న అభ్యర్థులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడింది ఐసిస్‌ ఉగ్రవాదులేనని అధికారులు భావిస్తున్నారు. బాంబు దాడి నేపథ్యంలో లిబియా ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. భద్రతా సిబ్బంది క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com